హనుమంతప్ప..హల్చల్ చేశాడప్పా
అర్ధరాత్రి సమయంలో మద్యం లేదన్నారని, తనతో తెచ్చుకున్న మద్యం కూడా తాగనివ్వని కారణంగా సింధనూరు శ్రీపురం కూడలిలోని ఓ రెస్టారెంట్లో కలబురగి వాసి హనుమంతప్ప తన రివాల్వర్తో గాలిలో కాల్పులు జరిపి అలజడి సృష్టించాడు.
మద్యం లేదన్నందుకు తుపాకీతో కాల్పులు
పోలీసుల అదుపులో ఉన్న హనుమంతప్ప
సింధనూరు, న్యూస్టుడే: అర్ధరాత్రి సమయంలో మద్యం లేదన్నారని, తనతో తెచ్చుకున్న మద్యం కూడా తాగనివ్వని కారణంగా సింధనూరు శ్రీపురం కూడలిలోని ఓ రెస్టారెంట్లో కలబురగి వాసి హనుమంతప్ప తన రివాల్వర్తో గాలిలో కాల్పులు జరిపి అలజడి సృష్టించాడు. భయంతో పరుగులు తీసిన జనం పోలీసులకు కబురు పెట్టగా..అప్పటికే కారులో వెళ్లిపోతున్న ఆ వ్యక్తిని సింధనూరు పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది. హనుమంతప్ప కలబురిగి వెళ్తూ మార్గం మధ్యలో కుటుంబంతో కారులో రెస్టారెంట్కు చేరుకున్నాడు. మద్యం కావాలని అడగ్గా..రెస్టారెంట్ యాజమాన్యం తమ వద్ద మద్యం లేదన్నారు. దీంతో కారులో ఉన్న తన మద్యం సీసా తెచ్చుకుని తాగబోయాడు. దాన్ని సిబ్బంది అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన హనుమంతప్ప కోపంతో ఊగిపోతూ బయట కారులో ఉన్న రివాల్వర్ తెచ్చి వీరంగం సృష్టించాడు. గాలిలో ఓ రౌండ్ కాల్చాడు. దీంతో జనం బెంబేలెత్తి తలోదిక్కుకూ పరుగులు తీశారు. యాజమాన్యం పోలీసులకు కబురు పెట్టారని తెలుసుకుని పారిపోగా..గ్రామీణ పోలీసులు మస్కి మార్గంలో కొంతదూరం వెంబడించి ఆయన్ని పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హనుమంతప్పను ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఉదయం స్టేషన్కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కుటుంబాన్ని అదే కారులో తమ ఊరికి పంపేశారు. హనుమంతప్ప కలబురగిలో రాజకీయ వ్యక్తులతో పరిచయాలు ఉన్న వ్యక్తి, మద్యం వ్యాపారి అని తెలుసుకున్నారు. స్థానిక గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.