రొయ్య.. ధర మోసమయ్యా..!
రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న బళ్లారి జిల్లా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.
నిలిచిన విక్రయాలతో రైతుల విలవిల
పెట్టుబడులు కూడా రావడమే కష్టం
విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలి
చేపల కోసం వల వేస్తున్న రైతులు బుజ్జిరాజు
బళ్లారి, న్యూస్టుడే: రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న బళ్లారి జిల్లా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. మూడు నెలల క్రితం కిలో రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించే రొయ్యలు నేడు రూ.175 నుంచి రూ.350లకు పడిపోయినా..అడిగే నాథుడు లేకుండాపోయాడు. మైనింగ్, జీన్స్ గార్మెంట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన బళ్లారి జిల్లా నేడు రొయ్యల పెంపకంలో మొదటి స్థానంలో నిలిచింది. బళ్లారి-6 వేలు, యాదగిరి-3 వేలు, రాయచూరు-1500, కరావలి జిల్లాలైన చిక్కమగళూరు, ఉడుపి జిల్లాలలో మొత్తం 2 వేల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. పదేళ్ల క్రితం 500 ఎకరాల విస్తీర్ణానికి పరిమితమైన మత్స్య సంపద నేడు కురుగోడు, సిరుగుప్ప, కంప్లి తాలూకాల్లో సుమారు 3వేల ఎకరాలకు విస్తరించింది. ఇందులో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 1,500 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. సాగుకు పనికిరాని చౌడు భూమిని ఇందుకు వినియోగిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో నీటి వనరులు ఉన్నా, మంచి నీటిలో రొయ్యల పెంపకం కష్టమైంది. దీంతో రైతులు వరి పొలాల నుంచి వృథాగా వాగులకు విడుదల చేసిన నీరు, వర్షపునీటిని నిల్వ చేసి చేపలు, రొయ్యల పెంపకానికి ఉపయోగించుకుంటున్నారు.
అధికారి శివన్నను కలసి చేపలను చూపుతున్న రైతులు
జిల్లాలో 6వేల టన్నుల ఉత్పత్తి
బళ్లారి జిల్లాలో 1,500 ఎకరాల్లో 3 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. చేపలు ఏడాదికి ఓసారి వస్తే రొయ్యలు ఏడాదికి రెండు సార్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి 6వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలో ఉత్పత్తి అయిన రొయ్యలను 90 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక నుంచి అమెరికా, చైనా, జపాన్ దేశాలకు ఏటా 1.25 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతుండగా రూ.48,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఈక్వెడార్లో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయిందని మత్య్సశాఖ సహాయ సంచాలకుడు శివన్న తెలియజేస్తున్నారు. హైదరాబాద్, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్లోని శీతల గిడ్డంగుల్లో 75 శాతం రొయ్యలు నిల్వ ఉన్నాయి. వాటిని విక్రయించిన తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరి తర్వాత మార్కెట్లో మంచి అవకాశాలు ఉండవచ్చని అధికారి తెలిపారు. బళ్లారి జిల్లాలో రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నా వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంఏ, ఎంకాం , డిప్లొమా తదితర ఉన్నత చదువులను అభ్యసించిన వారు, ఉద్యోగాలు కూడా వదులుకుని మరీ ఈ వృత్తిలో చేరారు. మార్కెట్ అనుకూలంగా లేకపోవడంతో కోలుకోకపోతే భవిష్యత్తు అంధకారమేనని వారు ఆందోళన చెందుతున్నారు.
దిగుబడి బాగా వచ్చిందని చూపుతున్న రైతు శ్రీనివాసరావు
ఖర్చులు తడిసిమోపెడు
కర్ణాటక సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్లో చేపలు, రొయ్యలు ఉత్పత్తి చేస్తున్న రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.3.75లకు ఇస్తున్నారు. దాన్ని రూ.1.50లకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కర్ణాటకలో రొయ్య రైతుల నుంచి యూనిట్కు రూ.7లు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా విద్యుత్తు యూనిట్ ఛార్జీలు తగ్గిస్తే అనుకూలంగా ఉంటుందని ఎమ్మిగనూరు గ్రామానికి రొయ్యలు ఉత్పత్తి చేస్తున్న రైతులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు ‘న్యూస్టుడే’కి తెలిపారు. ప్రస్తుతం రొయ్యల ధరలుపడిపోయాయి. ఏప్రిల్లో 30 కౌంట్ రకం రూ.600 ఉండగా, 60 కౌంట్ రూ.400లు, 80 కౌంట్ కిలో రూ.250లు ధరలు ఉండటంతో అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం 100 కౌంట్ రూ.170, 90 కౌంట్ రూ.180, 80 కౌంట్ రూ.190, 70 కౌంట్ రూ.200, 60 కౌంట్ రూ.220, 30 కౌంట్ రూ.360కి ధర పడిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు విచారం వ్యక్తం చేశారు.
రొయ్యలను పట్టుకుని చూపుతున్న రైతులు జానకిరామ్, రాఘురావ్ రాజు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు