వస్త్ర పరిశ్రమకు చక్కని వేదికలు
రాష్ట్రంలోని జాతీయ రహదారుల వ్యవస్థల సద్వినియోగం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా సదుపాయాలున్న జిల్లాల్లో జౌళి పరిశ్రమల విస్తరణకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్రానికి విన్నవించారు.
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను మంగళవారం
దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై
ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలోని జాతీయ రహదారుల వ్యవస్థల సద్వినియోగం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా సదుపాయాలున్న జిల్లాల్లో జౌళి పరిశ్రమల విస్తరణకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్రానికి విన్నవించారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం కేంద్ర జౌళి, ఆహార పౌరసరఫరా, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్తో ప్రత్యేక సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ మిత్రా పథకంలో భాగంగా జాతీయ రహదారులు, విద్యా సంస్థలున్న కలబురగి, తుమకూరు, విజయపురల్లో మెగా జౌళి పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రహదారులు, నౌకాశ్రయాలున్న నగరాలకు అనుసంధానం ఉండటం కూడా జౌళి రంగ విస్తరణకు అనుకూలంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇక్కడి గ్రామీణ పట్టభద్రులు, నైపుణ్య వనరులతో పరిశ్రమల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ ఆహార సరఫరా పథకం ద్వారా బహిరంగ విపణిలో పదివేల టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి అందేలా చేసింది. ఈ బియ్యం ప్రమాణాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి విన్నవించారు. 2023 మార్చి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నులు, తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర వాణిజ్య , జౌళి పరిశ్రమల శాఖ మంత్రి
పీయూష్ గోయల్కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న బొమ్మై
రక్షణ భూమి కోసం..
బెళగావి జిల్లా తుకమట్టి గ్రామంలో రక్షణశాఖకు చెందిన 732.24 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉండటంతో అభివృద్ధి పనుల నిమిత్తం ఆ ప్రాంతాన్ని జిల్లా యంత్రాంగానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు బొమ్మై విన్నవించారు. దిల్లీలో రక్షణ మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి ఈ భూముల్లో రాష్ట్రం చేపట్టే ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే బెళగావిలో ఏర్పాటు చేసిన సంగొళ్లి రాయణ్ణ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి సమర్పించారు.
సీఎం అందించిన వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న
పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్
అటవీ ప్రాజెక్టులపై..
ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో గుడేకోట కరడి ధామ, భీమాగడ్ అభయారణ్య ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ఈ అడవుల పరిసరాలను సూక్ష్మ వలయాలు (బఫర్ జోన్)గా ప్రకటించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కోరారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర జలవనరుల మంత్రి గోవింద కారజోళ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ్ ప్రసాద్, జలవనరులు, నగరాభివృద్ధి శాఖ ఏసీఎస్ రాకేశ్ సింగ్ హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్