విద్యార్థుల బ్యాగుల్లో ఏవేవో దొరికాయ్
కర్ణాటకలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల పుస్తకాల సంచులు సామాజికంగా ఆందోళన కలిగించే పెడ ధోరణులను వెల్లడించాయి.
కర్ణాటకలోని కార్పొరేట్ పాఠశాలల్లో వెలుగులోకి..
బెంగళూరు (సదాశివనగర): కర్ణాటకలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల పుస్తకాల సంచులు సామాజికంగా ఆందోళన కలిగించే పెడ ధోరణులను వెల్లడించాయి. అక్కడ తరగతి గదుల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడాన్ని ఇప్పటికే అన్ని విద్యా సంస్థలు నిషేధించాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఫోన్లు తెస్తున్నారేమోనని బెంగళూరులోని నాగరబావి, చుట్టుపక్కల ఉన్న హైస్కూళ్లలో విద్యార్థుల సంచులను సోదా చేసిన ఉపాధ్యాయులు కంగుతిన్నారు. వాటిలో కండోమ్లు, గర్భ నిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, మత్తు కోసం వైటనర్లు లభించాయి. కుప్పలుగా పోగైన ఈ వస్తువులను 8 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంచుల్లోనే గుర్తించడం గమనార్హం. ఇకపై విద్యార్థులను సోదా చేయకుండా వదిలేస్తే సమస్య తీవ్రమవుతుందని కర్ణాటక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం (కామ్స్) ఆందోళన వ్యక్తం చేసింది. సమస్య తీవ్రత దృష్ట్యా నగర పరిధిలోని అన్ని విద్యా సంస్థల్లో తక్షణమే తల్లిదండ్రులు, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. గర్భ నిరోధకాలు, సిగరెట్లు, వైట్నర్లతో దొరికిన విద్యార్థులకు ఆసుపత్రులలో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ప్రత్యేకంగా పది రోజుల సెలవులు ఇచ్చినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ ప్రతినిధి ‘న్యూస్టుడే’కు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ