ఓట్ల తొలగింపు ఒట్టిమాట
ఓటరు జాబితా నుంచి మైనార్టీల పేర్లు తొలగిస్తున్నారంటూ వస్తున్నవన్నీ వదంతులేనని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొట్టిపారేశారు.
తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి
సమావేశ వేదికపై వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి
ధార్వాడ: ఓటరు జాబితా నుంచి మైనార్టీల పేర్లు తొలగిస్తున్నారంటూ వస్తున్నవన్నీ వదంతులేనని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొట్టిపారేశారు. వదంతులను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. హుబ్బళ్లి విమానాశ్రయంలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ పరిష్కరిస్తుందని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని గుర్తు చేశారు. జాబితా నుంచి ఎవరి పేర్లైనా తొలగిస్తే.. తక్షణమే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.రెండు చోట్ల ఓటరుగా పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఇప్పుడు ఇబ్బంది వస్తుందని చెప్పారు.
నవకర్ణాటకకు రూపు
బెళగావి: నవ కర్ణాటక నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి కోసం రామదుర్గ నియోజకవర్గానికి రూ.2739 కోట్లు కేటాయించామని చెప్పారు. నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, విద్య, ఆసుపత్రులు, ఆనకట్టల నిర్మాణం, జలజీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటిని అందించామని వివరించారు. బెళగావి, బీదర్, కలబురగి, యాదగిరి, విజయపుర జిల్లాల సరిహద్దుల్లోని 1800 గ్రామ పంచాయతీల అభివృద్ధికి నూతన కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. సరిహద్దులలోని పాఠశాలల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. గోవా, షోలాపూర్, కాసరగోడుల్లో తలా రూ.10 కోట్ల ఖర్చుతో కన్నడ భవనాలను నిర్మిస్తామని చెప్పారు. రామదుర్గ సమీపంలోని కొన్ని గ్రామాలు తరచూ ముంపునకు గురవుతున్న నేపథ్యంలో రూ.120 కోట్లతో మలప్రభ నదీ తీరంలో అడ్డుగోడ నిర్మించేందుకు ఇప్పటికే భూమి పూజ చేశామని గుర్తు చేశారు.
విగ్రహావిష్కరణ..
బెళగావి: హుబ్బళ్లి నుంచి రామదుర్గకు చేరుకున్న ముఖ్యమంత్రి బసవేశ్వర కూడలిలో ఏర్పాటు చేసిన జగజ్యోతి బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి సవదత్తి తాలూకా బాల లింగేశ్వర మఠానికి వెళ్లారు. మఠాధిపతి ఆయనను ఆహ్వానించి.. ఘనంగా సత్కరించారు. మంత్రులు సి.సి.పాటిల్, గోవింద కారజోళ, మురుగేశ్ నిరాణి, భైరతి బవసరాజు, శశికళ జొల్లె, లోక్సభ సభ్యురాలు మంగళా అంగడి, కర్ణాటక పాల సమాఖ్య అధ్యక్షుడు బాలచంద్ర జార్ఖిహొళి, ఎమ్మెల్యే మహాదేవప్ప యాదవాడ తదితరులు ముఖ్యమంత్రితో కలిసి రూ.671.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రామదుర్గలో మీట నొక్కి బసవేశ్వరుడి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న బొమ్మై
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకు పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు