సద్దుమణగని సరిహద్దు
ఏటా డిసెంబరులో నిర్వహించే కర్ణాటక విధానసభ సమావేశాల నేపథ్యంలో చెలరేగే సరిహద్దు వివాదం ఈ ఏడాది కాస్త ముందుగానే చర్చకు దారి తీసింది.
వివాదాలతో నిత్యం ఇక్కట్లే
వివాదాగ్ని ఆరేదెలా?: బెళగావిపైనే మహారాష్ట్ర కన్ను
ఈనాడు, బెంగళూరు : ఏటా డిసెంబరులో నిర్వహించే కర్ణాటక విధానసభ సమావేశాల నేపథ్యంలో చెలరేగే సరిహద్దు వివాదం ఈ ఏడాది కాస్త ముందుగానే చర్చకు దారి తీసింది. భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణకు సిద్ధమవటంతో ఈ వివాదానికి ప్రాధాన్యం పెరిగింది. బెళగావి సువర్ణసౌధలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రికత్త వాతావరణాన్ని సృష్టించేవే. రెండు రాష్ట్రాలూ ఎన్నికలకు సిద్ధమవుతుండగా వివాదం మరింత పదునెక్కింది. ఇరు రాష్ట్రాలు, కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నా సరిహద్దు వివాదం తెరపైకి రావటం ఆసక్తికరం.
పార్టీలేవైనా అంతే..
కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరిహద్దు వివాదం ముగింపు లేని అంశంగా కొనసాగుతోంది. 1957లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన చట్టం మహారాష్ట్రకు న్యాయం చేకూర్చలేదని ఆ ప్రభుత్వం దశాబ్దాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెళగావిని కర్ణాటకలో భాగం చేయటం మహారాష్ట్రను నేటికీ కలచివేసే అంశంగా మారింది. తమకు చెందిన ప్రాంతాల కోసం ఇరు రాష్ట్రాల వాగ్వాదాన్ని పరిష్కరించేందుకు 1967లో ఏర్పాటైన మహాజన్ కమిషన్ 814 మరాఠి భాషా గ్రామాలు కర్ణాటకలో, 247 కన్నడ భాషా గ్రామాలు మహారాష్ట్రలో భాగమని తేల్చి చెప్పింది. ఈ కమిషన్ను కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినా మహారాష్ట్ర సవాలు చేస్తూనే ఉంది. 2017లో భాషా ప్రయుక్త చట్టాన్ని సవరించి కర్ణాటకలోని మరాఠి గ్రామాలు, బెళగావిని తిరిగి ఇవ్వాల్సిందిగా పొరుగు పాలకులు ‘సుప్రీం’ను ఆశ్రయించారు.
మంత్రులూ.. రావొద్దు
సరిహద్దు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే న్యాయవాదులను సమన్వయ పరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్లను నియమించింది. ఈ అంశాలపై కర్ణాటకలోని మరాఠా భాషా పరిరక్షణ సంఘాలు, గ్రామీణుల నుంచి వివరాలు సేకరించేందుకు శనివారం బెళగావిలో వారు పర్యటించాలనేది ఆలోచన. సీఎం సూచనతో మంత్రుల ‘వివాద’ పర్యటన వాయిదా వేశారు. 6న అంబేడ్కర్ జయంతిలో పాల్గొనేందుకు వస్తున్నట్లు ‘మహా’మంత్రులు స్పష్టం చేశారు.
కర్ణాటక వాదన
మహారాష్ట్ర జత్ తాలూకాలోని 47 గ్రామ పంచాయతీలు ప్రతి ఏటా నీటి ఎద్దడిని ఎదుర్కొనేవి. ఆ గ్రామాలు కన్నడ భాషా గ్రామాలుగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఈ పంచాయతీలు 2012లో కర్ణాటకలో విలీనం కావాలని తీర్మానించాయి. ఈ తీర్మానం అనంతరం గ్రామాలను మా రాష్ట్రంలో భాగం చేయాలన్న ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా కర్ణాటక తెరపైకి తెచ్చింది. ప్రతిగా బెళగావి అంశాన్ని ‘మహా’ వివాదంగా మారింది. ఈనెల 19నుంచి బెళగావిలో సమావేశాలకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవగా ఈ వివాదం మళ్లీ జీవం పోసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!