logo

భార్యను చూసి విజిల్‌ వేశాడని..

పొరుగింట్లో ఉంటున్న బాబు అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చి కొట్టి వెళ్లాడని బన్నేరుఘట్ట రోడ్డు రుక్మయ్య లేఅవుట్ నివాసి శోభిన్‌ బాబు (40) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 03 Dec 2022 12:55 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పొరుగింట్లో ఉంటున్న బాబు అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చి కొట్టి వెళ్లాడని బన్నేరుఘట్ట రోడ్డు రుక్మయ్య లేఅవుట్ నివాసి శోభిన్‌ బాబు (40) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఒక బ్యాంకులో ఉద్యోగి. నా భార్య ఇంటి బయట ఉన్నప్పుడు నిత్యం బాల్కనీలోకి వచ్చి విజిల్‌ వేస్తున్నావంటూ శోభిన్‌పై నిందితుడు దాడి చేశాడు. తనకు ఈల వేయడమే రాదని చెబుతున్నా, తన భార్య ముందే కొట్టారని బాధితుడు ఆక్రోశించాడు. తలకు గాయాలైన బాధితుడు చికిత్స చేయించుకుని పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. శోభిన్‌ పెంచుకుంటున్న చిలుక పొరుగింట్లో ఉంటున్న బాబు భార్య కనిపించిన వెంటనే ఈల వేసేది. తనకు కనిపించకుండా పొరుగింటి వ్యక్తి ఈల వేసి పోకిరిలా వేధిస్తున్నారని ఆమె తన భర్తకు చెప్పడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని