భార్యను చూసి విజిల్ వేశాడని..
పొరుగింట్లో ఉంటున్న బాబు అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చి కొట్టి వెళ్లాడని బన్నేరుఘట్ట రోడ్డు రుక్మయ్య లేఅవుట్ నివాసి శోభిన్ బాబు (40) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : పొరుగింట్లో ఉంటున్న బాబు అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చి కొట్టి వెళ్లాడని బన్నేరుఘట్ట రోడ్డు రుక్మయ్య లేఅవుట్ నివాసి శోభిన్ బాబు (40) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఒక బ్యాంకులో ఉద్యోగి. నా భార్య ఇంటి బయట ఉన్నప్పుడు నిత్యం బాల్కనీలోకి వచ్చి విజిల్ వేస్తున్నావంటూ శోభిన్పై నిందితుడు దాడి చేశాడు. తనకు ఈల వేయడమే రాదని చెబుతున్నా, తన భార్య ముందే కొట్టారని బాధితుడు ఆక్రోశించాడు. తలకు గాయాలైన బాధితుడు చికిత్స చేయించుకుని పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. శోభిన్ పెంచుకుంటున్న చిలుక పొరుగింట్లో ఉంటున్న బాబు భార్య కనిపించిన వెంటనే ఈల వేసేది. తనకు కనిపించకుండా పొరుగింటి వ్యక్తి ఈల వేసి పోకిరిలా వేధిస్తున్నారని ఆమె తన భర్తకు చెప్పడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్