వాయుదళానికి చక్కని శిక్షణ
భారత వాయుదళానికి చెందిన ‘బెంగళూరు శిక్షణ కేంద్రం’లో శనివారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరి పాల్గొని పలు అంశాలపై విశ్లేషించారు.
గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తున్న వాయుసేన అధికారి
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : భారత వాయుదళానికి చెందిన ‘బెంగళూరు శిక్షణ కేంద్రం’లో శనివారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరి పాల్గొని పలు అంశాలపై విశ్లేషించారు. శిక్షణ కేంద్రంలో అందుతున్న సేవలు, శిక్షణ రీతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సాంకేతికత అంశాలు తదితర వివరాలను ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆయనకు వివరించారు. అగ్నివీరుల విభాగానికి డిసెంబరు 30 నుంచి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మానవేంద్ర సింగ్ తెలిపారు. శిక్షణ సమయంలో ఎదురయ్యే సమస్యలను సవాలుగా తీసుకుని పరిష్కరించాలని వి.ఆర్.చౌధరి సూచించారు. ఇక్కడి శిక్షణ కేంద్రానికి అత్యుత్తమ ఏరోస్పేస్ సేఫ్టీ రికార్డు ఉందని ప్రశంసించారు. భారతీయ వాయుదళానికి ఈ ప్రధాన శిక్షణ కేంద్రం అందిస్తున్న సేవలు అత్యుత్తమమైనవి అని పేర్కొన్నారు.
లక్ష్యసేన్పై ఫిర్యాదు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : అర్జున పురస్కార గ్రహీత, అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ వంచనకు పాల్పడ్డారని హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వయసుకు సంబంధించి తప్పుడు దాఖలాలు ఇచ్చారని బెంగళూరు బ్యాడ్మింటన్ అకాడమీ యజమాని నాగరాజు ఫిర్యాదు చేశారు. లక్ష్యసేన్ 1998లో జన్మించారు. ప్రభుత్వం, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్లో సదుపాయాలను అందుకునేందుకు అనుగుణంగా తాను 2001లో పుట్టానని ప్రమాణపత్రాన్ని ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా లక్ష్య సేన్, అతని తల్లిదండ్రులు ధీరేంద్ర కుమార్ సేన్, నిర్మలా సేన్, సోదరుడు చిరాగ్ సేన్, తర్ఫీదుదారుడు విమల్ కుమార్లను విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ వస్తున్న వి.ఆర్.చౌధరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?