దివ్యాంగులకు సర్కారు చేయూత
అందరితో కలిసి జీవనం సాగించేలా దివ్యాంగ బాలలకు రూ.5లక్షలతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని బడ్జెట్లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు.
బధిర బాలలను ఆశీర్వదిస్తున్న బసవరాజ బొమ్మై
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : అందరితో కలిసి జీవనం సాగించేలా దివ్యాంగ బాలలకు రూ.5లక్షలతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని బడ్జెట్లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో సంబంధిత శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం అమలుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్మించి కేటాయించే వసతి గృహాల్లో మూడు శాతం దివ్యాంగులకే కేటాయిస్తామని ప్రకటించారు. బాలలకు ఇచ్చే సైకిళ్ల కోసం అదనంగా రూ.28 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దేవుడు పిల్లలను సృష్టించే సమయంలో ఒక్కొక్కొరిలో ఒక సమస్య ఉంచారని, శరీరంలో అన్నీ సక్రమంగా లేకపోవడాన్ని సవాలుగా తీసుకుని అధిగమించాలన్నారు. దివ్యాంగులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జీవన యాత్ర సాగిస్తున్నారని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించి తిలకించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి హలప్ప ఆచార్, ఎంపీ పీసీమోహన్, శాసనసభ్యుడు రిజ్వాన్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు.
కళా సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!