భక్తిశ్రద్ధలతో గీతా పారాయణ
మిస్సెస్ కెప్టెన్ మహిళా మండలి, రాష్ట్ర జాగృతి అభియానా సంయుక్తంగా శనివారం ఉదయం కోర్టు రహదారిలోని కెప్టెన్ ఆవరణలో గీతా జయంతి సందర్భంగా సామూహిక గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
బళ్లారి: పూలమాల వేస్తున్న రామకృష్ణ వివేకానంద కేంద్రం బ్రహ్మచారి కిరణ్కృష్ణస్వామీజీ తదితరులు
బళ్లారి, న్యూస్టుడే: మిస్సెస్ కెప్టెన్ మహిళా మండలి, రాష్ట్ర జాగృతి అభియానా సంయుక్తంగా శనివారం ఉదయం కోర్టు రహదారిలోని కెప్టెన్ ఆవరణలో గీతా జయంతి సందర్భంగా సామూహిక గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. 13 పాఠశాలల నుంచి వెయ్యి మంది విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్కుమార్, ముఖ్య అతిథిగా రామకృష్ణ వివేకానంద కేంద్రం బ్రహ్మచారి కిరణ్కృష్ణస్వామీజీ, మిస్సెస్ కెప్టెన్ మహిళా మండలి అధ్యక్షురాలు అల్లం సునంద పాల్గొని మాట్లాడారు. భగవద్గీత పుస్తకాలు పఠనం చేయడం వల్ల జ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. జీవితంలో కష్ట, సుఖాలు, బాధ్యత వంటి విషయాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమానికి కార్యదర్శి రమాదేవి, అల్లం దొడ్డన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.
బళ్లారి గ్రామీణ, న్యూస్టుడే: గీతాసేవాట్రస్ట్ ఆధ్వర్యంలో రామాంజినేయనగర్ గీతామందిరంలో శనివారం భగవద్గీత ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిద్దాత్మానంద సరస్వతి మాతాజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మందిరం వార్షికోతవాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణునికి అభిషేకాలు చేసి అలంకరించారు. భక్తులు సామూహికంగా గీతాపఠనం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రముఖులు జానకీరామ్, వెంకటరమణ పాల్గొన్నారు.
సింధనూరు: సింధనూరు-మస్కి మార్గంలోని పగడదిన్నిక్యాంపులో భక్తులు గీతా జయంతిని పురస్కరించుకుని శనివారం రెండు రోజుల పారాయణం ప్రారంభించారు. క్యాంపులోని శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం ధ్వజారోహణ చేసి కైంకర్యాలు ప్రారంభించారు. భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు సేవా సమితి జిల్లా ముఖ్యుడు బోసుబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..