‘బంగారం’లాంటి కబురు!.. కేజీఎఫ్ పునరుద్ధరణకు చర్యలు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోలారు బంగారు గనుల (కేజీఎఫ్)కు పూర్వవైభవం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగనున్నాయి.
ఓ వెలుగు వెలిగి.. నిస్తేజంగా మారిన బంగారు గనులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోలారు బంగారు గనుల (కేజీఎఫ్)కు పూర్వవైభవం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగనున్నాయి. సరిగ్గా 22 సంవత్సరాల కిందట ఈ గనుల మూసివేసిన విషయం తెలిసిందే. వీటిని మళ్లీ తెరవాలనే ప్రతిపాదనలకు కొదవలేదు. తాజాగా కేంద్ర నిపుణులు బంగారు గనులపై దృష్టి సారించారు. కేజీఎఫ్ పరిసరాల్లోనే బంగారు తీసేందుకు టెండర్లను ఆహ్వానించారు. 2001లో బంగారు గనుల తవ్వకాలను బంద్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు మా సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేజీఎఫ్ పరిధిలోని 3500 మందికి రూ.52 కోట్ల పరిహారం చెల్లించకుండా కర్మాగారాలను ఎక్కడికక్కడ మూసివేశారు. న్యాయం కోసం కార్మికులు నేటికీ పోరాటాలు చేస్తున్నా పరిహారం దక్కలేదు.
* భూగర్భం నుంచి బయటకు తెచ్చిన మట్టి నుంచి బంగారు సేకరించాక ఆ మట్టిని గుట్టలుగా పడవేశారు. వాటిని సైనేడ్ గుట్టలుగా స్థానికులు పిలుస్తారు. ఇలాంటి గుట్టలు కేజీఎఫ్ చుట్టుపక్కల 13 దాకా ఉన్నాయి. వాటి నుంచి బంగారు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ గుట్టల్లో 35 లక్షల మిలియన్ టన్నుల మట్టి ఉందని లెక్కగట్టారు. ఆ మట్టిని నిపుణులు ఇదివరకే పరిశోధించారు. టన్ను మట్టిలో గ్రాము బంగారు దొరుకుతుందని తేలింది. ఈ లెక్కన ఇక్కడి మట్టిలో 25 టన్నుల బంగారు సేకరించవచ్చని అంచనా వేశారు. త్వరలోనే బంగారు తీసే ప్రక్రియను ప్రారంభిస్తామని భూగర్భ గనుల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్లో నిరుపయోగంగా ఉన్న యంత్రాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వాటిని వేలం వేయలేని స్థితి ఎదురవుతోంది. యంత్ర పరికరాలను నిత్యం ఎవరో ఒకరు ఎత్తుకెళ్లడం నిత్యకృత్యం. ఈ దొంగతనాలపై అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పెద్ద గాలి వీస్తే సైనేడ్ గుట్టల నుంచి దుమ్ము నివాస ప్రాంతాల్లోకి వచ్చి పడుతోంది. చర్మ, మూత్రపిండాల వ్యాధులతో పాటు క్యాన్సర్ కారకాలకు ఈ మట్టి కారణమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిహారం చెల్లించకపోయినా ఉచిత ఆరోగ్య సేవలు అవసరమని కార్మికులు డిమాండు చేస్తున్నారు.
ఎండా వానలకు తుప్పుపట్టిన యంత్రాలు
పాడుపడిన కేజీఎఫ్ గనుల యంత్రాల పునరుద్ధరణ
నిరుపయోగంగా మారిన ‘బంగారు’ గుట్టలపై కేంద్రం దృష్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామా అల్లుళ్లకు సవాల్!
[ 17-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో కలబురగి (ఎస్సీ రిజర్వు) కూడా ఒకటి. పాలక, ప్రతిపక్షాల, ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. -
గణపతి వరమందిస్తే.. విజయం సాధించినట్లే
[ 17-04-2024]
లక్ష్య సిద్ధి కోసం నేతలంతా దేవాలయాలను సందర్శించడం సర్వసాధారణం. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ఈ విశ్వాసం రెట్టింపవుతుంటుంది. -
ఇరుపక్షాలకూ అసమ్మతి సెగ
[ 17-04-2024]
దేశంలోనే కీలకమైన హసన లోక్సభ నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ నేతల కుటుంబీకులు పోటీపడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి రెట్టింపయ్యింది. -
కమల- దళ జోరు
[ 17-04-2024]
భాజపా, జనతాదళ్ నేతలు మంగళవారం మండ్య నగర రాజకీయాలకు కొత్త రూపునిచ్చారు. రెండు పార్టీల రాష్ట్రాధ్యక్షులు బి.వై.విజయేంద్ర, హెచ్.డి.కుమారస్వామి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. -
ధార్వాడ దండు
[ 17-04-2024]
రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తున్న ధార్వాడ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల బరిలో సత్తా చాటడానికి కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసింది. పార్టీ అభ్యర్థిగా వినద్ అసూటి నామినేషన్ వేయడానికి మంగళవారం ఊరేగింపు నిర్వహించిన వేళ కదలివచ్చిన కార్యకర్తలు, మద్దతుదారులు వీరంతా. -
జనతాదళ్తో పొత్తు గట్టిదే : అప్ప
[ 17-04-2024]
జనతాదళ్-భాజపా పొత్తు కొనసాగుతుందని భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్ప తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను ఇప్పటికే 23 లోక్సభ నియోజకవర్గాలను చుట్టి వచ్చానని చెప్పారు. -
హాస్య నట సార్వభౌమ ద్వారకీశ్ కన్నుమూత
[ 17-04-2024]
సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత ద్వారకీశ్ (81) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఉదయం నిద్ర లేచిన ఆయన కాఫీ తాగి, మళ్లీ నిద్రపోయారు. అదే ఆయనకు చిరనిద్రగా మారింది. -
‘వారసత్వ’ రథాల జోరు
[ 17-04-2024]
లోక్సభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న తమ వారసులను గెలిపించుకునేందుకు కుటుంబసభ్యులు ప్రచార రంగంలోకి దిగారు. మండుటెండలనూ లెక్క చేయకుండా ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. -
మండ్యలో కొత్త ఊపు
[ 17-04-2024]
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం బుధవారం నుంచి కొత్త హంగులు అద్దుకోనుంది. ఇప్పటి వరకు జాతీయ పార్టీల తారా ప్రచారంలో భాజపా నేతల దండే సందడి చేసింది. ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న జేడీఎస్కు హెచ్.డి.దేవేగౌడ సహకారం ఎలాగూ ఉండనే ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రాముడికి ‘సూర్యతిలకం’.. కనులవిందుగా అద్భుత దృశ్యం
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
-
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు