హస్తినకు తాకిన సరిహద్దు సెగ
మంగళవారం అగ్నిగోళంగా మారిన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు బుధవారం కాస్త ప్రశాంతంగా మారింది. పరిస్థితి ఇంకా అదుపులోనికి రాలేదని బెళగావి, విజయపుర జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది.
కర్ణాటక సర్కారు తీరుపై సర్వత్రా ఆక్షేపణ
వాహనాల రద్దుతో అష్టకష్టాలు
ఈనాడు, బెంగళూరు
మంగళవారం అగ్నిగోళంగా మారిన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు బుధవారం కాస్త ప్రశాంతంగా మారింది. పరిస్థితి ఇంకా అదుపులోనికి రాలేదని బెళగావి, విజయపుర జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. కన్నడ సంఘాల నేతలు బెళగావి నుంచి బెంగళూరుకు చేరుకున్నా..ఇరు రాష్ట్రాల రాజకీయ నేతల వ్యాఖ్యానాలు ఈ వివాదాన్ని మరింత సజీవంగా మారుస్తోంది. మహారాష్ట్ర మంత్రుల రాకను వ్యూహాత్మకంగా నిలువరించిన కర్ణాటక ప్రభుత్వం కొత్త చిక్కులు కొని తెచ్చుకుంది. ‘మహా’ మంత్రుల రాకపై ఆంక్షలు విధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీరుపై బుధవారం ప్రారంభమైన పార్లమెంట్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి. వెరసి బుధవారం సరిహద్దులకు పరిమితమైన వివాదం దిల్లీకి చేరుకుంది.
ముఖ్యమంత్రి తీరుపై ‘మహా’ ఆక్రోశం
ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యలతోనే బెంగళూరులోని కన్నడ పరిరక్షణ సంఘాలు బెళగావిలో ఆందోళనను ఉధృతం చేశాయని మహారాష్ట్ర రాజకీయ నేతలు దుయ్యబట్టారు. అధికార పక్షం మొదలు విపక్షాలు, మహారాష్ట్ర ఏకీకరణ, నవ నిర్మాణ సమితులు బొమ్మై తీరును తీవ్రంగా ఆక్షేపించాయి. కేవలం సరిహద్దుల్లో సామరస్యాన్ని కాపాడేందుకు మహారాష్ట్ర మంత్రులను అడ్డుకున్నట్లు ముఖ్యమంత్రి బొమ్మై సమర్థించుకున్నారు. పరోక్షంగా ముఖ్యమంత్రి బొమ్మై సరిహద్దు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లు శివసేన, ఎన్సీపీ నేతలు ఆరోపించారు. సుప్రీం కోర్టులో విచారణ ఉన్న అంశంపై చర్చించబోనని ప్రకటిస్తూనే సున్నిత అంశంపై కన్నడిగులను రెచ్చగొట్టారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మహారాష్ట్రలో చేతకాని సర్కారు ఉందని ఆరోపించారు. అసలు భాజపా మూలాలు లేని బసవరాజ బొమ్మై..మహారాష్ట్ర ప్రజలను నిర్దేశించటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బెళగావి కోసం దశాబ్దాలుగా చెలరేగుతున్న వివాదం దృష్ట్యా..ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన వెనుక కేంద్ర హస్తం ఉందని ఆయన దుయ్యబట్టారు.
పార్లమెంట్లోనూ
బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సరిహద్దు వివాదం ధ్వనించింది. ఎన్సీపీ ఎంపీ సుప్రియ సులే..సరిహద్దు వివాదంపై ప్రస్తావించారు. గత పది రోజులుగా కర్ణాటక ప్రభుత్వం అలజడిని సృష్టించినట్లు ఆమె ఆరోపించారు. కేవలం రాజకీయ లక్ష్యంతోనే కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్రను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో మరాఠా ప్రజలు, వాహనాలపై దాడులు సరికాదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన కర్ణాటక ఎంపీ శివకుమార్ ఉదాసి..మహారాష్ట్ర రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఈ వివాదంతో రాజకీయం చేయటం అలవాటుగా చేసుకున్నట్లు ఆరోపించారు. అభద్రతతో మహారాష్ట్ర రాజకీయ పార్టీలు చేస్తున్నట్లు చర్యలకు పార్లమెంట్లో స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్న అంశంపై చర్చ ఎందుకని ప్రశ్నించారు.
అమిత్షాకు నివేదించిన ఫడణవీస్
దిల్లీ, ముంబయి: సరిహద్దుకు సంబంధించి కర్ణాటక-మహారాష్ట్రల నడుమ రేకెత్తిన వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్షాతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను నివేదించారు. వివాదాన్ని చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ‘మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన’ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. వచ్చే ఏడాది కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వివాదాన్ని రాజేస్తున్నారని విమర్శించారు.
అఖిలపక్ష సమావేశం అవసరమా?
సరిహద్దు వివాదంపై అఖిల పక్ష సమావేశం అనివార్యత ఇంకా రాలేదని రాష్ట్ర జలవనరుల మంత్రి గోవింద కారజోళ అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్దంగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు యత్నిస్తోంది. ముఖ్యమంత్రి బొమ్మై ఈ విషయంపై సమాలోచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇందులో రాజకీయనేతల వ్యాఖ్యలు, సలహాలు అవసరం లేదని సూచించారు. ఇదే అంశంపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ సున్నిత అంశాలపై ఆందోళనలు, నిరసనలు చేస్తే సహించలేది లేదని హెచ్చరించారు. చట్టాలను చేతులోనికి తీసుకుంటే చట్టాలే వారిని శిక్షిస్తాయన్నారు.
వాహనాల రద్దు
బుధవారం కర్ణాటక, మహారాష్ట్రల మధ్య వాహన సంచారం స్తంభించింది. కేఎస్ఆర్టీసీ, ఎంఎస్ఆర్టీసీ బస్సులను బెళగావి, సోలాపూర్, కొల్లాపూర్, నిప్పాణి, ముద్దే బీహాళ్, సవదత్తి, పుణె, పణజి, వాస్కో తదితర డిపోల నుంచి బస్సుల సంచారాన్ని నిషేధించారు. బెళగావి నుంచి పుణెకు 240, పుణె నుంచి బెళగావికి 140 బస్సు సర్వీసులు ఉండగా, వీటిల్లో 70శాతం సేవలను నిలిపివేశారు. ఈ కారణంగా విద్యార్థులు, వాణిజ్య, ఆహార ఉత్పత్తుల సరఫరా స్తంభించింది. నిత్యం ఈ సరిహద్దుల మధ్య 2,500కుపైగా ప్రైవేటు వాహనాలు, లారీలు సంచరిస్తుండగా, బుధవారం వీటిల్లో 60శాతం వాహనాలను నిలిపివేసినట్లు బెళగావి లారీ యజమానుల సమాఖ్య వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్