logo

నమోచే.. నమ్మ మెట్రో ప్రారంభం

నమ్మ మెట్రో రైలు పథకం కింద ఐటీ బీటీ ప్రాంతాల్లో నిర్మించిన మెట్రో రైలు సంచార మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

Published : 08 Dec 2022 01:52 IST

బయ్యప్పనహళ్లి- వైట్‌ఫీల్డ్‌ మార్గంలో ప్రయోగత్మకంగా మెట్రో రైలు సంచారం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: నమ్మ మెట్రో రైలు పథకం కింద ఐటీ బీటీ ప్రాంతాల్లో నిర్మించిన మెట్రో రైలు సంచార మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయన తేదీల కోసం ఎదురు చూస్తోంది. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారం అందించారు. విధానసభ ఎన్నికలు దగ్గరకు రావడంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రధానమంత్రిని రాష్ట్రానికి రప్పించి ప్రారంభోత్సవాలు, బహిరంగసభలు నిర్వహించాలని భాజపా పాలకులు నిర్ణయించారు. అందులో భాగంగా బయ్యప్పనహళ్లి- వైట్‌ఫీల్డ్‌ మార్గంలో 15.5 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ఆయన చేత ప్రారంభించాలని తీర్మానించారు. ఆ మార్గంలో అక్టోబరు నుంచి మెట్రో రైలు సంచారం ప్రయోగాత్మకంగా ప్రారంభించి చూశారు. కేంద్ర రైల్వే సురక్షిత మండలి నిపుణులు వచ్చి పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఆపని త్వరగా పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రైలు సంచారాన్ని ప్రారంభించి, నెల తరువాత ప్రయాణికులకు అనుమతించే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టర్మినల్‌నూ ఇలానే ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని