కంప్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా
కంప్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం చేస్తామని, త్వరలో ఇక్కడ చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని జిల్లా మంత్రి బి.శ్రీరాములు తెలిపారు.
జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి, శాసనసభ్యుడు తదితరులు
కంప్లి, న్యూస్టుడే: కంప్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం చేస్తామని, త్వరలో ఇక్కడ చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని జిల్లా మంత్రి బి.శ్రీరాములు తెలిపారు. కంప్లిలో రైతు సంపర్క కేంద్ర భవనం ప్రారంభోత్సవంతో పాటు రూ.9.7 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. త్వరలో కంప్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పాలనాధికారికి సూచిస్తానన్నారు. కంప్లికోటె వద్ద తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. శాసనసభ్యుడు గణేశ్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని కంప్లిని నగరసభగా మార్చాలన్నారు. పట్టణంలో ఇళ్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేయాలని విన్నవించారు. వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేయాలన్నారు. పురసభ స్థాయి సమితి అధ్యక్షుడు సి.ఆర్.హనుమంత, పురసభ అధ్యక్షురాలు వి.శాంతలా, ఉపాధ్యక్షురాలు కె.నిర్మల, జౌళి, మూల సౌకర్య అభివృద్ధి మండలి అధ్యక్షుడు గుత్తిగనూరు విరుపాక్షి గౌడ, ఏపీఎంసీ అధ్యక్షుడు హూవణ్ణ, మాజీ ఎంపీ జె.శాంత, తహసీల్దార్ గౌసియా బేగం, ముఖ్యాధికారి శివలింగప్ప, పురసభ సభ్యులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా: గణేష్
కంప్లి, న్యూస్టుడే: కంప్లి విధానసభ క్షేత్రంలో తుంగభద్ర ఆయకట్టు రైతులకు సాగు నీరందించేందుకు ఓవైపు అల్లుడు (మాజీ శాసన సభ్యుడు సురేశ్ బాబు), మరో వైపు తమ్ముడు (శాసనసభ్యుడు గణేశ్) తీవ్ర కృషి చేస్తున్నారని జిల్లా మంత్రి శ్రీరాములు తెలిపారు. కంప్లి పురసభ కార్యాలయం ముందు బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పైవిధంగా మాట్లాడారు. అంతకుముందు శాసనసభ్యుడు గణేశ్ మాట్లాడుతూ రాములన్నకు సురేశ్ బాబు అల్లుడైతే తాను తమ్ముడిలాండి వాడినన్నారు. గణేశ్ భాజపాలో చేరతారంటూ క్షేత్రంలో ఇటీవల వదంతులు విన్పిస్తున్నాయని, అలాంటిదేమీ లేదని. కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానంటూ గణేశ్ స్పష్టం చేశారు. అయినా నేడు కంప్లిలో వీరిద్దరూ ఇలా మాట్లాడడం వదంతులకు ఊతమిచ్చినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM