logo

బెంగళూరులో కొనసాగుతున్న అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా

రాత్రింపగళ్లూ ఇక్కట్లు పెట్టే చలి వాతావరణాన్ని లెక్క చేయకుండా నగరంలోని స్వాతంత్య్ర ఉద్యానవనంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ధర్నా గురువారం నాడూ కొనసాగించారు

Published : 20 Jan 2023 02:04 IST

వెనక్కితగ్గని అంగన్‌వాడీలు

బెంగళూరు (యశ్వంతపుర) ,న్యూస్‌టుడే : రాత్రింపగళ్లూ ఇక్కట్లు పెట్టే చలి వాతావరణాన్ని లెక్క చేయకుండా నగరంలోని స్వాతంత్య్ర ఉద్యానవనంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ధర్నా గురువారం నాడూ కొనసాగించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఆందోళన ఆగనేలేదు. మంత్రులు, ఉన్నతాధికారులు రాకపోవడంతో రాత్రంతా ధర్నా కొనసాగిస్తామని బాధితులు ప్రకటించారు. కార్మిక సంఘాల వారే వారికి భోజనం సరఫరా చేశారు. కనీస వేతనం, ప్రాథమిక ఉపాధ్యాయులుగా గుర్తించాలనే డిమాండ్‌తో పోరాటం ప్రారంభించారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కదలబోమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని