పాక్ యువతి అక్రమప్రవేశం
భారతదేశంలోకి అక్రమంగా వచ్చి బెంగళూరులో ఉంటున్న ఇక్రా జీవని (19) అనే పాక్ యువతిని, ములాయం సింగ్ (26) అనే ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడిని బెళ్లందూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
సహజీవనం సాగించిన యువకుడికి కటకటాలు
బెళ్లందూరు పోలీసులు అరెస్టు చేసిన పాక్ యువతి, యూపీ యువకుడు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : భారతదేశంలోకి అక్రమంగా వచ్చి బెంగళూరులో ఉంటున్న ఇక్రా జీవని (19) అనే పాక్ యువతిని, ములాయం సింగ్ (26) అనే ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడిని బెళ్లందూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు పరిశీలించకుండా వారికి ఇంటిని బాడుగకు ఇచ్చిన గోవిందరెడ్డి అనే వ్యక్తిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ములాయం సింగ్ కొన్నేళ్లుగా హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఒక సంస్థలో కాపలాదారు. గేమింగ్ యాప్ ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెను నేపాల్ వరకు విమానంలో పిలిపించుకుని, అక్కడి నుంచి అక్రమ మార్గంలో సరిహద్దు దాటించి, బెంగళూరుకు గత ఏడాది సెప్టెంబరులో తీసుకు వచ్చాడు. ఇద్దరూ లేబర్ క్వార్టర్స్లో సహ జీవనాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల కిందట పాక్లో ఉన్న తన తల్లితో ఇక్రా ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కాల్ను నిఘా వర్గాలు గుర్తించాయి. వారి కోసం వేటసాగించి ఇన్నాళ్లకు అరెస్టు చేశారు. యువతిని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయానికి అప్పగించారు. ఆమె పేరును రావా యాదవ్గా మార్చుకుని, కొత్త పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని వైట్ఫీల్డ్ విభాగం డీసీపీ గిరీశ్ తెలిపారు. తదుపరి విచారణలో మరికొన్ని వివరాలు బయటపడతాయని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.