విహంగ విన్యాసాలపై సమాలోచన
యలహంక వాయుయాన కేంద్రం (ఎయిర్ బేస్)లో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కొనసాగే ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.
రాజ్నాథ్సింగ్తో వీసీ సందర్భంగా బొమ్మై అధికారుల సమాలోచన
కలబురగి, న్యూస్టుడే : యలహంక వాయుయాన కేంద్రం (ఎయిర్ బేస్)లో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కొనసాగే ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్తో ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్సులో కలబురగి నుంచి బొమ్మై పాల్గొన్నారు. ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ 1996 నుంచి వరుసగా ఎయిర్షోకు బెంగళూరు ఆతిథ్యం ఇస్తోందన్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది భారీ స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎక్కువ కంపెనీలు ప్రదర్శనకు వస్తుండగా, ఎక్కువ మంది సందర్శకులు విమానాల ప్రదర్శనలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో విమానాల విడిభాగాలతో పాటు, విమానాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
* పోలీస్ ఎస్సై నియామకాలకు సంబంధించి నిందితుడు ఆర్డీ పాటిల్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని బొమ్మై చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లు ఇవ్వాలని డీవైఎస్పీ శంకరగౌడ డిమాండ్ చేశారని ఆర్డీ పాటిల్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. నిందితుని వద్ద ఉన్న దాఖలాలు, సాక్ష్యాలకు అనుగుణంగా దర్యాప్తు అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆరోపణలలో నిగ్గు తేలేందుకు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించానని తెలిపారు. నిందితుడు ఈ కేసు నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆరోపణలు చేస్తున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. నిందితుడు విడుదల చేసిన వీడియో ఇంటర్వ్యూలోని వాస్తవాలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించనని స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తున్న నాయకులనే ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
విద్యకే పెద్దపీట
దేవల గాణగాపుర : విద్యాలయ కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై, తదితరులు
కలబురగి, న్యూస్టుడే : ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. గత పాతికేళ్లుగా దేవల గాణగాపురలో స్థానిక పేద కుటుంబాలకు విద్యాబోధనకు విశేషంగా శ్రమిస్తున్న హేరూరు విద్యా సంస్థలో మంగళవారం రజతోత్సవాలను ఆయన ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకుడు విఠల హేరూరు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బోధకులు, విద్యార్థుల తల్లిదండ్రులలో తాను విఠల హేరూరు వ్యక్తిత్వాన్ని చూస్తున్నానని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి విద్యావంతుల అవసరం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. హావేరి అంబిగెరె చౌడయ్య పీఠాధిపతి శాంతభీష్మ స్వామి, అల్లమప్రభు పీˆఠాధిపతి మల్లప్పణ్ణ స్వామీజీ, ఎమ్మెల్యేలు ఎం.వై.పాటిల్, దత్తాత్రేయ పాటిల్ రేవూర, ఎమ్మెల్సీ బాబూరావు చించనసూరు, మాజీ ఎమ్మెల్సీ బాబూరావు చించనసూరు, మాజీ మంత్రలు మాలికయ్య గుత్తేదార్, ప్రమోద్ మధ్వరాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు