నిజాయితీకి నీడ కరవు
సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోశ్ హెగ్డే అభిప్రాయపడ్డారు.
జస్టిస్ సంతోష్హెగ్డే వ్యాఖ్య
మైసూరు, న్యూస్టుడే : సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోశ్ హెగ్డే అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం కొలీజియం నిర్వహణ చక్కగా ఉందన్నారు. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీ ప్రక్రియలో కేంద్రం జోక్యం అవసరం లేదన్నారు. ధర్మం, భాష విషయంలో దేశ ప్రజలు విడిపోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలలో అవినీతి తాండవమాడుతోందని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు తమకు తామే ప్రజలకు యజమానులమని భావించుకుంటున్నారని విమర్శించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్న రాజకీయ నాయకులు, అవినీతిపరులను అరెస్టు చేసి కారాగారానికి ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. లోకాయుక్తకు న్యాయమూర్తిగా సేవలందించిన సమయంలోనే ప్రజల వాస్తవ సమస్యలను అర్థం చేసుకునేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. సమాజంలో శ్రీమంతులైతే చాలు.. కారాగారానికి వెళ్లి వచ్చినా సలాం కొడతారని వ్యాఖ్యానించారు. నేటి సమాజంలో నిజాయతీ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలలో కేసుల విచారణ సుదీర్ఘ కాలం కొనసాగడం సరికాదన్నారు. మనిషి సరళ జీవితాన్ని గడపడమే అన్ని సమస్యలకూ పరిష్కారమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్