సాంస్కృతిక సౌరభం..వసంత వైభవం
హంపీ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం హొసపేటె పట్టణ ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాబృందాల వసంత వైభవ కార్యక్రమం జానపద కళా ప్రపంచాన్ని ఆవిష్కరించింది.
ఆకట్టుకున్న కళాబృందాల ఊరేగింపు
ఉగ్రనరసింహుడి వేషధారణలో కళాకారుడి బీభత్సం
హొసపేటె, న్యూస్టుడే: హంపీ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం హొసపేటె పట్టణ ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాబృందాల వసంత వైభవ కార్యక్రమం జానపద కళా ప్రపంచాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రంలోని నలు మూలల నుంచి సుమారు 40 కళాబృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మరగాళ్ల కళాకారులు, నందికోలు, కోలాట, డోలు, కంసాళె, లంబాడీల గిరిజన నృత్యం, రామాయణ దృశ్యాభియనం కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సారి ఊరేగింపులో ఆశా కార్యకర్తలు కూడా పాల్గొనడం ప్రత్యేకం. మంత్రులు శశికళా జొల్లె, ఆనంద్సింగ్, ఎంపీ దేవేంద్రప్పలు పచ్చజెండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు. జానపదం మన పథం కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. హంపీలోని కన్నడ మాతా భువనేశ్వరి ఉత్సవమూర్తిని వాహనంలో ప్రతిష్ఠించి ప్రత్యేకంగా అలంకరించారు. హంపీ ఆలయం ఏనుగు లక్ష్మీకూడా ఊరేగింపులో పాల్గొంది. భువనేశ్వరి మాతా ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించిన వాహనాన్ని స్వయాన మంత్రి ఆనంద్సింగ్ నడిపారు. పాదగట్టె ఆంజనేయ ఆలయం, మూడంగళ్ల కూడలి, ప్రయాణ ప్రాంగణం, పునీత్, అంబేడ్కర్ కూడళ్ల గుండా సాగిన ఊరేగేంపు జిల్లా క్రీడామైదానంలో సమాప్తమైంది. జిల్లా పాలనాధికారి టి.వెంకటేశ్, జడ్పీ సీఈవో హర్షల్ బోయర్, ఎస్పీ శ్రీహరిబాబు ఊరేగింపులో పాల్గొన్నారు.
వసంతవైభవంలో కళాబృందాల ఊరేగింపు
మహిళ జానపద నృత్యం, లంబాడీ మహిళల గిరిజన నృత్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!