‘ముఖ్యమంత్రిపై మాట్లాడే నైతికత మీకెక్కడిది?’
ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ తమ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అవినీతిపై మాట్లాడే నైతికత లేదు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో డీసీ, ఎస్పీ, జడ్పీ సీఈవో, తదితరులు
బళ్లారి, న్యూస్టుడే: ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ తమ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అవినీతిపై మాట్లాడే నైతికత లేదు. అవినీతిలో కాంగ్రెస్ పెద్ద రాయబారి. కాంగ్రెస్ నేతల డీఎన్ఏలో కూడా అవినీతి తెలుస్తోందని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి.శ్రీరాములు విమర్శించారు. విమ్స్ వైద్య కళాశాల క్రీడామైదానంలో 74వ గణతంత్ర దినోత్సవంలో త్రివర్ణ జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నోరు విప్పితే అవినీతి మాటలు తప్పా...మరి ఏమి రావడం లేదన్నారు. తమ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడే నైతికత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ దోస్తిల రంగు త్వరలో వెల్లడికానుందన్నారు. ఓటమి భయంతో సిద్ధరామయ్య కోలారు వీడే ఆలోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులభం కాదన్నారు. ఏడాది ముందు బళ్లారి జిల్లా బాధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు తీయించినట్లు తెలిపారు. రాబోయే విధానసభ ఎన్నికల్లో బళ్లారి జిల్లా నుంచే పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. బళ్లారి గ్రామీణ, లేకుంటే సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. డీసీ పవన్కుమార్ మాలపాటి, జడ్పీ సీఈవో జి.లింగమూర్తి, ఎస్పీ రంజిత్కుమార్ బండారు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!