logo

అపూర్వ అక్షయ పాత్ర

బెంగళూరు శివారు వసంతపురలో నూతనంగా నిర్మించిన ఇస్కాన్‌ శ్రీరాజాధిరాజ గోవింద దేవస్థానాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం సందర్శించారు. అక్కడ అక్షయ పాత్ర వంట గదిని ఆసక్తిగా పరిశీలించారు.

Published : 29 Jan 2023 04:02 IST

బెంగళూరు శివారు వసంతపురలో నూతనంగా నిర్మించిన ఇస్కాన్‌ శ్రీరాజాధిరాజ గోవింద దేవస్థానాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం సందర్శించారు. అక్కడ అక్షయ పాత్ర వంట గదిని ఆసక్తిగా పరిశీలించారు. నిత్యం 20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర సంస్థను ఆయన అభినందించారు. శ్రీరాజాధిరాజ గోవింద స్వామి దర్శనం చేసుకుని పూజ చేశారు. నిర్వాహకులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు.

న్యూస్‌టుడే, యశ్వంతపుర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని