సాంకేతికతకు మరింత మెరుగు
ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వివరించారు. పదేళ్ల కిందట సైబర్ నేరాలంటే ఎక్కువ మందికి తెలియదని, ప్రస్తుతం పలువురు ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి అమిత్షా
ధార్వాడ, న్యూస్టుడే : ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వివరించారు. పదేళ్ల కిందట సైబర్ నేరాలంటే ఎక్కువ మందికి తెలియదని, ప్రస్తుతం పలువురు ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త తరహా నేరాలను అడ్డుకునేందుకు మన సాంకేతికతను మరింత అభివృద్ధిపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు అమిత్షా, ప్రహ్లాద్ జోషి, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్ తదితరులతో కలిసి ధార్వాడలో కర్ణాటక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం భూమి పూజలో శనివారం బొమ్మై పాల్గొని మాట్లాడారు. సైబర్ క్రైమ్, డిజిటల్ క్రైమ్, నార్కోటిక్స్లను నియంత్రించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి నేరం ఒక కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నట్లు సైబర్ నేరాల నియంత్రణకు కేంద్రం ఇప్పటికే పలు చట్టాలు చేసిందని గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న చట్టాలు, సాంకేతికతతో నేరాలు, నేరగాళ్లను గుర్తించేందుకు ఫోరెన్సిక్స్ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయం అవసరం ఏర్పడిందన్నారు. తాను హోం మంత్రిగా ఉన్న సమయంలో రెండు ప్రాంతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలల ఏర్పాటు, బెంగళూరులోని కేంద్రాన్ని రూ.30 కోట్లతో ఉన్నతీకరించామని చెప్పారు. విదేశాలలో తరరహా భారతదేశంలో మొదటిసారిగా కర్ణాటకలోనే 180 మందికి పైగా నిపుణులను ‘స్పెషల్ ఆఫీసర్ ఆన్ క్రైం సీన్’ పేరిట నియమించుకున్నామని, వారికి సహకరించే 52 మంది ఫోరెన్సిక్ నిపుణులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కర్ణాటకపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ప్రత్యేక అభిమానం ఉండడంతోనే ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం పలికారని పేర్కొన్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులకూ ఈ విశ్వవిద్యాలయ సహకారాన్ని, సేవలు అందిస్తుందని చెప్పారు. ఉప కులపతి జీఎం వ్యాస్, ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లద్, అమృత్ దేశాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ప్రారంభ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు
రాష్ట్ర ప్రగతి కొత్త పుంతలు
హోంమంత్రికి స్మరణిక అందిస్తున్న సంస్థ ప్రతినిధులు
హుబ్బళ్లి, న్యూస్టుడే : కర్ణాటక ప్రగతిపర రాష్ట్రమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటకను మరింత ముందంజలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. పలు రంగాలలో ఇతర రాష్ట్రాలకు కర్ణాటక ఆదర్శంగా ఉందని చెప్పారు. కేఎల్ఈ సంస్థ బీవీ భూమరెడ్డి ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయం సువర్ణ మహోత్సవాలను కేంద్ర హోం మంత్రి అమిత్షాతో ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి విద్యా సంస్థలకు వచ్చినప్పుడు తాను మరోసారి విద్యార్థి కావాలని అనిపిస్తుందని బొమ్మై అన్నారు. తాను చదువుకునే రోజులలో ఇక్కడ కేవలం మూడు సెక్షన్లు మాత్రమే ఉండేవని, క్యాంటిన్ తనకు ఇష్టమైన ప్రదేశమని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని తెలిపారు. స్వాతంత్య్ర అమృతమహోత్సవాలను నిర్వహించుకున్న భారతదేశం రానున్న పాతికేళ్లలో ఉత్తుంగ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ కళాశాల, కేఎల్ఈ సంస్థలు నవ భారత నిర్మాణంలో కీలక పాత్రను పోషించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏ రాష్ట్రమైనా విద్యా పరంగా ముందంజలోకి వస్తేనే ఆర్థిక సాధికారతను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని తెలిపారు. మొదటి సెమీ కండక్టర్, ఆర్ అండ్ డి విధానాలను కర్ణాటకలో తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఉపాధి అవకాశాలను కల్పించే వారికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించామని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్షా కర్ణాటకలో మహిళల రక్షణ కోసం రూ.700 కోట్లు, బెంగళూరు నగరాభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించారని చెప్పారు. సహకార రంగంలోనూ ఉత్తమ ప్రగతి సాధించేందుకు షా అందిస్తున్న సహకారం అమూల్యమని కొనియాడారు.
కేఎల్ఈ సంస్థ ప్రాంగణంలో జ్యోతి వెలిగిస్తున్న అమిత్షా
* ముఖ్యమంత్రి బొమ్మై పుట్టిన రోజును దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ విద్యార్థులు తమకు పార్టీ ఇవ్వాలని సీఎంను కోరారు. తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే పార్టీ, పార్టీ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ‘పార్టీ ఇద్దాం’ అని చెప్పి, ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, జగదీశ్ శెట్టర్, మంత్రులు మురుగేశ్ నిరాణి, శంకర పాటిల మునేనకొప్ప, కేఎల్ఈ సంస్థ కార్యాధ్యక్షుడు ప్రభాకర్ కోరే తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?