జేడీఎస్కు అధికారమివ్వండి
రాబోయే విధానసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇవ్వాలి. దీంతో పార్టీ విడుదల చేసిన పంచరత్నాలను అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కుమారస్వామిని సన్మానిస్తున్న అభిమానులు
బళ్లారి, న్యూస్టుడే: రాబోయే విధానసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇవ్వాలి. దీంతో పార్టీ విడుదల చేసిన పంచరత్నాలను అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పేర్కొన్నారు. పంచరత్న రథయాత్రలో భాగంగా బళ్లారి జిల్లా సండూరు తాలూకా తోరణగల్లు, కురెకుప్పలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. పంచరత్న రథయాత్రంలో ప్రకటించిన హామీలను పరిష్కరించడానికి రూ.2.50లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రజలు తమకు పూర్తి ఆధిక్యం ఇవ్వాలన్నారు. పూర్తి మెజార్టీ రాకపోతే ఇచ్చిన హామీలు పూర్తి చేయడం కష్టమవుతుందన్నారు. గత 25 రోజులుగా జరుగుతున్న పంచరత్న రథయాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే జేడీఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఓటర్లు జేడీఎస్కి మరోసారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర కర్ణాటకలో జేడీఎస్కి శక్తి లేదని మాట్లాడుతున్నారు. కుమారన్న ఒక్కసారి మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ ప్రాంత అభివృద్ధి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇళ్లుకు పరిమితమవుతున్నారు. ప్రజలు సమస్యలపై స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ ఏకపక్ష ధోరణి
గత సంయుక్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నా వద్ద సరిగ్గా ప్రవర్తించలేదు. ముఖ్యమంత్రి అయినా ఇంటిని ఇవ్వలేదు. చివరికి హోటల్లోనే ఉంటూ పరిపాలన కొనసాగించాను. పార్లమెంట్ ఎన్నికల్లో తుమకూరు క్షేత్రం నుంచి తమను ఓడించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
జాతీయ పార్టీలది కుటుంబ రాజకీయం
కాంగ్రెస్, భాజపాలోనూ కుటుంబ రాజకీయాలు ఉన్నాయని కుమార తెలిపారు. జేడీఎస్పై మాట్లాడే నైతికత వారికి లేదన్నారు. సిద్ధరామయ్య తన కుమారుడు కోసం వరుణ విధానసభ క్షేత్రం వదిలిపెట్టారు. మల్లికార్జున ఖర్గే, బీఎస్.యడియూరప్ప, కె.ఎస్.ఈశ్వరప్ప తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారు. వారు విమర్శించడం సరికాదన్నారు. వారు చేయడం కుటుంబ రాజకీయం కాదా? అని ప్రశ్నించారు.
రెడ్డి పార్టీ నుంచి తమకు అనుకూలం
అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలతో జైలు నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించారని కుమార వ్యాఖ్యానించారు. ఆ పార్టీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. అనుకూలంగా మారుతుందన్నారు. ఉత్తమ కర్ణాటకలోని క్షేత్రాల్లో కె.ఆర్.పి. పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మైసూరు ప్రాంతంలో తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపడం లేదన్నారు.
10న రెండో విడత అభ్యర్థుల ప్రకటన
రాబోయే విధానసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొదటి విడతగా అభ్యర్థులు పేర్లను అప్పటికే ప్రకటించాం. రెండో విడత అభ్యర్థుల పేర్లును ఈ నెల 10న ప్రకటిస్తామన్నారు. హాసన జిల్లాలోని ఏడు విధానసభ స్థానాల్లో ఎలాంటి సమస్యలేదు. ఈ దీనిపై 3న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి కోల్డ్వార్, హాట్ వార్ జరగలేదన్నారు. తమ పార్టీలో ఉన్న సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎం.పి.ప్రకాష్కు కూడా పలు పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. పార్టీకి సీనియర్ నేతలు అవసరం లేదు. కొత్త నాయకత్వంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు సోమలింగనగౌడ, సోమప్ప పాల్గొన్నారు. కుడతిని పట్టణంలో భూ పోరాట సమితి 44 రోజులుగా చేస్తున్న ఆందోళన ప్రదేశానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సోమవారం రాత్రి 10గంటలకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులు కూడా పలు సమస్యలను వివరించారు. ఓ మహిళా రైతు కన్నీరు పెట్టుకోవడంతో కుమార ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
సండూరు పట్టణంలో పంచరత్న రథయాత్రలో హెచ్.డి.కుమారస్వామి, తదితరులు
కుమారస్వామితో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్