గెలిచి సత్తా చాటుతాం
ఎవరినో ఓడించాలని కాక ఎన్నికల్లో గెలిచి సత్తా చూపేందుకే తాను ప్రాంతీయ పార్టీని స్థాపించినట్లు కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ సంస్థాపకుడు గాలి జనార్దన్రెడ్డి పునరుద్ఘాటించారు.
పంపాసరోవరంలో పూజలు చేస్తున్న జనార్దన్రెడ్డి కుటుంబం
గంగావతి, న్యూస్టుడే: ఎవరినో ఓడించాలని కాక ఎన్నికల్లో గెలిచి సత్తా చూపేందుకే తాను ప్రాంతీయ పార్టీని స్థాపించినట్లు కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ సంస్థాపకుడు గాలి జనార్దన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన మంగళవారం ఆనెగుందిలో కల్యాణ రథయాత్రకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. తన పార్టీ నెలరోజుల పసికందు అన్నారు. చులకనగా మాట్లాడే వారందరికీ ఎన్నికల అనంతరం తన శక్తి తెలిసి వస్తుందన్నారు. సుమారు 30 నుంచి 40 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో తప్పక గెలిచే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అభ్యర్థులను బరిలోకి దించుతామన్నారు. ఇతర పార్టీలు, నేతలను విమర్శించనంటూ అభివృద్ధి మంత్రం జపిస్తానన్నారు. ప్రాంతీయ పార్టీకి మనుగడ లేదంటున్న వారు ఆంధ్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు అనుభవాలను గుర్తుకు తెస్తామన్నారు. రథయాత్ర ప్రారంభానికి ముందు జనార్దన్రెడ్డి కుటుంబం సభ్యులు పంపాసరోవరంలో పూజలు చేశారు. అనంతరం ఆనెగుంది చేరుకుని ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లక్ష్మీ అరుణ, బ్రాహ్మణి రాజీవ్రెడ్డి, యమనూర్ చైడ్కి, మనోహరగౌడ పాల్గొన్నారు.
ఆనెగుందిలో ప్రచార వాహనం కల్యాణ రథానికి పూజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ