హంపీ ఉత్సవాలకు సొబగు..ధ్వని-వెలుగు
హంపీ ఉత్సవాల్లో చివరి భాగం ధ్వని, వెలుగు కార్యక్రమం 2న ముగియనుంది. గత నెల 26 నుంచి హంపీ పరిధిలోని గజశాలలో సుమారు 110 మంది కళాకారులతో ధ్వని, వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ధ్వని,వెలుగు కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల దర్బార్
హొసపేటె, న్యూస్టుడే: హంపీ ఉత్సవాల్లో చివరి భాగం ధ్వని, వెలుగు కార్యక్రమం 2న ముగియనుంది. గత నెల 26 నుంచి హంపీ పరిధిలోని గజశాలలో సుమారు 110 మంది కళాకారులతో ధ్వని, వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికోసం 8 ప్రత్యేక వేదికలను నిర్మించారు. స్థానిక, స్థానికేతర కళాకారులకు అవకాశం కల్పించారు. విజయనగర వైభవం పేరిట ధ్వని,వెలుగు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. హంపీ ఉత్సవాల్లో ఈ కార్యక్రమమే ప్రధాన ఆకర్షణ. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. అంతటి ప్రేక్షకాదరణ పొందినందుకే ప్రతి హంపీ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ప్రోత్సాహక ధనం కూడా అందిస్తారు. ఏటా ఈ కార్యక్రమానికి రూ.50లక్షలదాకా ఖర్చవుతుంది. విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావానికి కారణమైన పరిస్థితులు, హక్క,బుక్కల పాలన. అనంతరం వచ్చిన రాజులు ప్రౌఢదేవరాయ, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల పాలన దృశ్యాలను ఇక్కడ కళాకారులు అభినయిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య పతనం వరకు కథ సాగుతుంది. కళాకారులెవరూ ఇక్కడ సంభాషణలు చెప్పరు. నేపథ్యసంభాషణ ఉంటుంది. దానికి తగ్గట్టు కళాకారులు అభినయిస్తారు. ఏ వేదికపైన కళాకారులు అభినయిస్తుంటారో ఆ వేదికపైన మాత్రం వెలుగు ఉంటుంది. అందుకోసమే ఈ కార్యక్రమానికి ధ్వని,వెలుగు అని పేరుపెట్టారు. 2వ తేదీ చివరి ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం 7.30నుంచి రాత్రి 9.30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీకృష్ణదేవరాయ దంపతులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు