అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు
విధానసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కీలక నేతలంతా కలిసి దాదాపు 150 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు.
సమావేశంలో పాల్గొన్న రణదీప్సింగ్ సుర్జేవాల, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, వీరప్పమొయిలీ, ఎంబీ పాటిల్ తదితరులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : విధానసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కీలక నేతలంతా కలిసి దాదాపు 150 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ హోటల్లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సమితి సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, ఎగువ సభలో ప్రతిపక్ష నేత బీకేహరిప్రసాద్, పీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పలుమార్లు ఇదే విషయంలో సమీక్షించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ అత్యధిక చోట్ల విజయం సాధించవచ్చునని సమీక్షలు వెల్లడించాయని పార్టీ నేతలు వివరించారు. 130 చోట్ల విజయమే లక్ష్యమని తెలిపారు. వీలైనంత వేగంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్ఠానం సూచించడంతో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించారు. ప్రతి నియోజకవర్గంపైనా పలు మార్లు చర్చించారు. బ్లాక్ కాంగ్రెస్ సమితి నివేదికలను పరిశీలించారు. అభ్యర్థుల విజయావకాశాలపై విశ్లేషించారు. ప్రస్తుత శాసనసభ్యుల్లో తొమ్మిది మంది మినహా మిగతా వారందరికీ టిక్కెట్ ఇవ్వాలని తీర్మానించారు. కొందరు శాసనసభ్యులు వయోభారం, ఇతర కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొంటారని సమాచారం. అభ్యర్థుల ఎంపిక సమయంలో ఉదయ్పుర్ తీర్మానాలను అమలు చేయాలని అధిష్ఠానం సూచించింది. ఏ నాయకుడైనా పార్టీలో చేరిన తక్షణం టిక్కెట్ పొందే అవకాశానికి ఈసారి స్వస్తి చెబుతున్నారు.
త్యాగాలకు సిద్ధం
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల సమితి సమావేశం నిర్వహిస్తున్నామని, విధానసభకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే వారందరికీ అవకాశాలు కష్టమని, నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ త్యాగాలు చేయాలన్నారు. అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి సిఫార్సు చేస్తామన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిక ఘట్టం సవాల్గా మారిందన్నారు. కాంగ్రెస్ గెలుపు కచ్చితమని తేల్చిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు