ప్రగతి కోసం నిధుల వెల్లువ
కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ఎక్కువ నిధులను కేటాయించారని భాజపా కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్సింగ్ పేర్కొన్నారు.
భాజపా వేదికపై యడియూరప్ప, బొమ్మై, కటీల్, అరుణ్ సింగ్
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ఎక్కువ నిధులను కేటాయించారని భాజపా కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్సింగ్ పేర్కొన్నారు. ఎగువ భద్రా ప్రాజెక్టుకు రూ.5300 కోట్లతో పాటు వివిధ పథకాలను అమలు చేసేందుకు కేంద్రం మొదటి నుంచి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథభవన్లో శుక్రవారం నిర్వహించిన కేంద్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో పాల్గొనేందుకు ముందుగా తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. జలజీవన్ మిషన్కు రూ.70 వేల కోట్లు, రైల్వే పథకాలకు, నగరాభివృద్ధికి నిధులను కేటాయిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. కర్ణాటకలో పలు జిల్లాలలో నీటి సమస్య ఉందని, దాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. కర్ణాటకలో ఈసారి భాజపా కనీసం 150 సీట్లు గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, పార్టీ అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ తదితరులు పాల్గొన్నారు.
సేద్యం.. విలువలు ఘనం
‘కాసిన సర’ ఆడియో విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై తదితరులు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : అన్నదాతను కేంద్రంగా చేసుకుని సేద్యాన్ని ప్రోత్సహించే పథకాలు అత్యవసరమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. సేద్యం ఎప్పుడూ విలువలతో కూడిన పవిత్ర కార్యమని అన్నారు. అనిశ్చితి మధ్యలోనూ భూమి తల్లి తనను నమ్ముకున్న వారికి జీవనాధారంగా ఉంటుందని తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సేద్యం చేస్తుంటారని వివరించారు. కాసినసర (కాసులపేరు) సినిమా ఆడియో సీడీని శుక్రవారం ఆయన బెంగళూరులో విడుదల చేసి మాట్లాడారు. ఒక గింజను విత్తితే.. వందలాది ధాన్యం గింజలు లభిస్తాయని తెలిపారు. గ్రామాలలో ఆడపిల్లలు, గృహిణులు ఎంతో ఇష్టపడే కాసులపేరును చేయించుకోవాలని ఆశపడుతుంటారని, దాన్ని ఇతివృత్తంగా చేసుకుని సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నంజుండేగౌడను సీఎం అభినందించారు. దర్శకుడు ఎస్టీ సోమశేఖర్, అటవీ అభివృద్ధి మండలి అధ్యక్షురాలు తారా అనూరాధ, నిర్మాత దొడ్డనాగేగౌడ, నటులు విజయ్ రాఘవేంద్ర, హర్షికా పుణచ్చ, నీనాసం సతీశ్, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు భా.మా.హరీశ్, నిర్మాత సంఘం అధ్యక్షుడు ఉమేశ్ బణకార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM