కుటుంబం ఆత్మహత్యాయత్నం
అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు విషం తాగి బలవన్మరణానికి యత్నించారు.
ఒకరు మృతి - ఆరుగురు ఆస్పత్రిపాలు
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు విషం తాగి బలవన్మరణానికి యత్నించారు. చికిత్స అందించేలోగా మంగళమ్మ (28) అనే యువతి మరణించింది. ఆసుపత్రిలో చేరిన మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రామనగర తాలూకా దొడ్డ మణ్ణగుడ్డె గ్రామానికి చెందిన మంగళమ్మ, ఆమె భర్త రాజు (31), అత్త సొల్లాపురదమ్మ (48), పిల్లలు ఆకాశ్ (9), కృష్ణ (13), మంగళమ్మ చెల్లెలు సవిత (24), సవిత కుమార్తె దర్శిని (4) బెంగళూరు శివారు ప్రాంతం కుంబళగూడు సమీపంలోని సుబ్బరాయనపాళ్యలో ఉంటున్నారు. పిల్లలు బడికి వెళుతుండగా, పెద్దలందరూ కూలిపనులు చేసేవారు. కరోనా మహమ్మారి అనంతరం కుటుంబ నిర్వహణకు వారు ఇతరుల నుంచి తీసుకున్న రుణం వడ్డీతో కలిపి రూ.10 లక్షలకు చేరుకుంది. అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించారు. ఎలుకల మందులో చక్కెర, అరటి పండు గుజ్జు కలుపుకొని తమ పూర్వీకుల సమాధి వద్దకు వెళ్లి గురువారం సాయంత్రం దాన్ని తిన్నారు. వారు విషాన్ని తిన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మండ్యలోని మిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళమ్మ శుక్రవారం ఉదయం మరణించింది. రామనగర గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్