logo

బీదర్‌లో సిద్ధు సందడి

ఎన్నిప్రయత్నాలు చేసినా భాజపాకు ఓటమి తప్పదని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య జోస్యం చెప్పారు.

Published : 05 Feb 2023 06:51 IST

భాల్కి : మఠాధిపతి నుంచి సత్కారం అందుకుంటున్న సిద్ధరామయ్య

బీదర్‌, న్యూస్‌టుడే : ఎన్నిప్రయత్నాలు చేసినా భాజపాకు ఓటమి తప్పదని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. విజయసంకల్ప పేరిట చేస్తున్న యాత్రలతో ఎటువంటి ప్రయోజనం లేదని గుర్తించాకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాధ్వని యాత్రలో భాగంగా ఆయన బీదర్‌ జిల్లా భాల్కి, ఔరాద్‌ పట్టణాలలో పర్యటించారు. భాజపాకు యడియూరప్ప అనివార్యమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రావని అర్థం చేసుకున్న భాజపా, ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు కిందామీదా పడుతోందని ఎద్దేవా చేశారు. అన్ని పనులలో అవినీతి, సీడీ వివాదం, గుత్తేదారుల నుంచి కమీషన్లు, ప్రశ్నపత్రాల బహిర్గతం తదితర అంశాలే భాజపాను ఎదుదురెబ్బ తీస్తాయని హెచ్చరించారు. భాల్కిలో చెన్నబసవ పట్టదేవర మఠానికి వెళ్లి విగ్రహానికి నివాళి అర్పించారు. పార్టీ నాయకులు ఎంబీపాటిల్‌, ఈశ్వరఖండ్రే, భైరతి సురేశ్‌, ప్రకాశ్‌ రాథోడ్‌, బసవరాజ రాయరెడ్డిలతో కలిసి యాత్రను కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని