logo

సౌదీలో ముగ్గురు కన్నడిగుల మృతి

సౌదీ అరేబియా రియాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ముగ్గురు మరణించారు.

Published : 05 Feb 2023 06:55 IST

మంగళూరు, న్యూస్‌టుడే : సౌదీ అరేబియా రియాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ముగ్గురు మరణించారు. హళెయంగడికి చెందిన రిజ్వాన్‌, సూరత్కల్‌కు చెందిన అకీల్‌, మంగళూరు నివాసి నాసిర్‌లను మృతులుగా గుర్తించారు. నాలుగు నెలల కిందటే వీరు ఉపాధి కోసం సౌదీకి వెళ్లారు. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఒంటెను వీరి వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాలను భారత్‌కు తీసుకు వచ్చేందుకు దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.


ప్రేమ పేరిట అత్యాచారం

మైసూరు, న్యూస్‌టుడే : ప్రేమించి.. వివాహం చేసుకుంటానని నమ్మించిన మనోజ్‌ అనే యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక యువతి (23) లక్ష్మీపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు. తనను హత్య చేసేందుకు మనోజ్‌ ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వాపోయారు. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, రెండు వారాలు గాలించి శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని