భారత్కు విశ్వగురువు స్థానం ఖాయం
మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో చూసేందుకు రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వాలకు సహకారం అందివ్వాలని గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ పిలుపునిచ్చారు.
కొట్టూరులో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన తరళుబాళు పౌర్ణమి ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ థావర్చంద్ గహ్లోత్
హొసపేటె: మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో చూసేందుకు రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వాలకు సహకారం అందివ్వాలని గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ పిలుపునిచ్చారు. చిత్రదుర్గం తరళుబాళు మఠం ఆధ్వర్యంలో విజయనగర జిల్లా కొట్టూరులో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన తరళుబాళు పౌర్ణమి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే చాలా దేశాలు భారత్వైపు చూస్తున్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను అమితంగా గౌరవిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన దేశం విశ్వగురువు కావడంతో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. క్రీ.శ.1946లో చిత్రదుర్గంలో ప్రారంభమైన తరళుబాళు సిరిగేరి మఠం నేడు సమాజాభివృద్దికి తన వంతు కృషి చేస్తోందని కొనియాడారు. పీఠాధిపతి శివకుమార్ శివాచార్య స్వామీజీ మతసామరస్యానికి మరోపేరని తేల్చిచెప్పారు. మనది పురాతన ధర్మం. రుషిమునులు, శరణులు ఈ ధర్మరక్షణకు తమ జీవితాలను పణంగా పెట్టారని గుర్తు చేశారు. ధర్మరక్షణకు ప్రజలు వెనకాడవద్దని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి మాట్లాడుతూ..విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మఠాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని నొక్కిపలికారు. కొద్దిసేపటికి వేదిక నుంచి గవర్నర్, కేంద్ర మంత్రి నిష్క్రమించారు. అనంతరం సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ ప్రజలకు సంస్కారం, జ్ఞానం అందివ్వడంలో మఠాలు నిరంతర కృషి చేస్తున్నాయని కొనియాడారు. ఏటా ఓ జిల్లాలో ఉత్సవాలను ఏర్పాటు చేసినా ప్రజల్లో ధర్మ జాగృతి కల్పిస్తున్న తరళుబాళు మఠం అధిపతిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో మాజీ సీఎం యడియూరప్ప, తరళుబాళు మఠం శివమూర్తి శివమూర్తి స్వామీజీ, అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ నావడగి, ఎంపీ వై.దేవేంద్రప్ప, ఎమ్మెల్యే ఎన్.వై.గోపాలకృష్ణ, మాజీ మంత్రి హెచ్.ఆంజనేయ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కమహాదేవి జీవితచరిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పాల్గొన్న ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్