వేసవి ముంగిట రాజకీయ వేడి
కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కసరత్తుపై గురువారం చర్చించనున్న క్రమంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది.
ఫిరాయింపు రాజకీయం షురూ
పెత్తనం కోసం అధికారపక్ష పోరు
పార్టీకి.. ముందు వెనుక బొమ్మై- అప్ప నాయకత్వం
ఈనాడు, బెంగళూరు : కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కసరత్తుపై గురువారం చర్చించనున్న క్రమంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. ఈ చర్చల అనంతరం ఏ క్షణంలోనైనా ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశముంది. అనధికారికంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు.. పార్టీ కార్యాలయాలన్నీ వలస నేతలతో సందడిగా కనిపిస్తున్నాయి. పాత జెండాలు పక్కనపెట్టి- కొత్త బావుటాలు మోసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. పార్టీల అంతర్గత సమాచారంతో తమకు, లేదా తమ అభిమాన నేతలకు టికెట్ రాదని తెలుసుకున్న జిల్లా స్థాయి నేతలు మూకుమ్మడిగా పార్టీలను ఫిరాయిస్తున్నారు. జాతీయ పార్టీల్లో ఈ రాకపోకలు మరింత అధికంగా ఉన్నాయి. మరోవారంలో ఈ రెండు పార్టీల్లో ప్రథమ శ్రేణి నేతలు కూడా తమకు ఇష్టమైన పార్టీ గూటికి ఎగిరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
భాజపా.. సమీకరణాలు
ఫిరాయింపు పర్వంతోనే అధికార పగ్గాలు చేపట్టిన అధికార పక్షం భాజపా.. గత మూడున్నరేళ్ల పాలన కాలంలో విధేయులను ఏమాత్రం పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. చివరి విడత మంత్రివర్గ విస్తరణ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన సీనియర్లు, పార్టీ విధేయులు చివరకు భంగపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యేలు రేణుకాచార్య మొదలు తిప్పారెడ్డి, పూర్ణిమ శ్రీనివాస్, కేఎస్ ఈశ్వరప్ప, రమేశ్ జార్ఖిహొళి, సి.పి.యోగేశ్వర్ వంటి 20 మంది నేతలు చివరికంటా తమ ఆశలు నెరవేర్చుకోలేకపోయారు. మంత్రివర్గంలో వలస నేతల హవా చివరి వరకు కొనసాగింది. మలివిడత విస్తరణలో ప్రక్షాళనకు అవకాశం ఉందని భావించిన సినీయర్లు- ఎన్నికల ముంగిట నిలుచున్నారు. ఈ పార్టీలో ప్రత్యక్ష రాజకీయానికి వయసు పరిమితులు సీనియర్ల అవకాశాలకు గండికొడుతున్నాయి. తిప్పారెడ్డి, వి.సోమణ్ణ తదితరులు 70 ఏళ్ల పైబడిన వారు కావటంతో వీరికి రానున్న ఎన్నికల్లో సీటు కష్టమన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేఎస్ ఈశ్వరప్పకు సైతం ఇదే సమస్య తలెత్తుతోంది. రానున్న ఎన్నికల్లో గెలుపు సత్తా కంటే ఎన్నికలు ఎదుర్కొనే యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ కారణంగా పార్టీలో భవిష్యత్తు కష్టమనుకున్న నేతలంతా ప్రత్యామ్నయాల వైపు దృష్టి సారిస్తున్నారు.
కాంగ్రెస్కు ఖర్గే నాయకత్వ బలం ఉపకరించేనా?
పెత్తనమెవరిది?
అధికార పక్షంలో నిర్ణయాధికారం అతి పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన యడియూరప్ప వచ్చే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారని పార్టీ త్రిమూర్తులు- ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగంగా ప్రకటించి వెళ్లారు. సీట్ల పంపిణీల్లోనూ ఆయన పాత్ర కీలకం కానుండటంతో పార్టీలో ఆధిపత్య పోరు జోరందుకుంది. మరోవైపు పార్టీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోశ్ కూడా యడియూరప్పకు అధిష్ఠానం ఇస్తున్న మద్దతు చూసి కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా తన వారసుల కోసం యడియూరప్ప చేస్తున్న ప్రయత్నాలు ద్వితీయ శ్రేణి నేతలకు కంటగింపుగా మారినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బొమ్మై నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా ఎన్నికల తర్వాత సమీకరణాలు ఎవరి నాయకత్వాన్ని సూచిస్తాయో అంతుచిక్కని వ్యవహారం.
కాంగ్రెస్కు ఎవరో
ప్రస్తుతం కాంగ్రెస్లో నాయకత్వ పోరు పైకి కనిపించకున్నా నివురుగప్పిన నిప్పులానే ఉంది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమదైన స్థాయిలో ప్రచార రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో సోనియాగాంధీ నిర్ణయాధికారం నుంచి పక్కకు తప్పుకోవటం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర సీనియర్ నాయకులకు సలహాలు ఇచ్చేంత అనుభవం లేకపోవటం పార్టీని వెన్నాడుతున్న ప్రధాన సమస్య. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం రాష్ట్ర వ్యవహారాల్లో అంత చురుకుగా కనిపించకపోవటం కూడా పార్టీ ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా పార్టీలోనికి వలస నేతలకు రాష్ట్ర నేతలే కీలకంగా మారారు. ప్రస్తుతం భాజపా నుంచి మంత్రివర్గంలో పని చేసిన ముగ్గురు నేతలు, జేడీఎస్ సీనియర్ నేత శివలింగేగౌడ, కోలారు శ్రీనివాసగౌడ కాంగ్రెస్లో చేరటం దాదాపు ఖరారైంది. మరోవారం పాత మైసూరు నుంచి మరో ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు 30 మందికిపైగా భాజపా, జేడీఎస్ల నుంచి కాంగ్రెస్ జెండాను అందుకున్నారు. వీరి సంఖ్య వచ్చే వారంలో మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
జనతాదళ్లో తండ్రీ కుమారులే కీలకం
జేడీఎస్ దారెటు?
మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ అనారోగ్యం, కుటుంబ కలహాలతో జేడీఎస్లో అంతా సవ్యంగా లేదన్నది కొట్టిపారేయలేని వాస్తవం. కేవలం కుమారస్వామి మాత్రమే పార్టీని ఒంటి చేత్తో మోస్తున్నారు. ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం లేని నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తుండటం ఆ పార్టీని వెన్నాడే కీలక ఇబ్బంది. ఇప్పటికే 75 శాతం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జేడీఎస్లో భవిష్యత్తు కోసం ఎదురు చూసేవారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. జాతీయ స్థాయి ఎన్నికల పూర్వ విశ్లేషణలు రాష్ట్రంలో మళ్లీ సంకీర్ణం అన్న సమీక్షలు మాత్రమే జేడీఎస్కు బలంగా మారాయి. కనీసం 30 స్థానాలు సాధించినా ఆ పార్టీ కింగ్ మేకర్ కాగలదన్న ధీమా ఎక్కువగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్