logo

తెరపైకి రమ్య రాజకీయం

విధానసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ సినీ నటి రమ్య రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టే యోచనలో ఉన్నారని సమాచారం.

Published : 21 Mar 2023 01:59 IST

సినీ నటి రమ్య

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ సినీ నటి రమ్య రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టే యోచనలో ఉన్నారని సమాచారం. ఆమెను ఎన్నికల్లో పోటీ చేయించాలని ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆమె కోసం మూడు నియోజకవర్గాలను గుర్తించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు ధ్రువీకరించాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మనాభనగరతో పాటు మండ్య, చెన్నపట్టణ నియోజకవర్గాల్లో ఒకచోట ఆమెను బరిలో దించాలనేది ఆలోచన. ఆమె ఇదివరకే ఓసారి మండ్య ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్లపాటు ఏఐసీసీ సామాజిక మాధ్యమ విభాగ బాధ్యతలను నిర్వహించారు. ఆపై.. రాజకీయాలకు దూరమై.. సినిమాలు నిర్మించేందుకు ‘ఆపిల్‌ స్టూడియో’ ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ కర్ణాటకలో చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో రెండు రోజులు పాటు కలిసి నడిచారు. ఆమె కాంగ్రెస్‌ను విడలేదనే సంకేతాలిచ్చారు. ఈ ఎన్నికల సమయంలో క్రియాశీల రాజకీయాల్లో పునః ప్రవేశానికి అవకాశాలున్నాయని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని