జన సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ పేర్కొన్నారు. కుణిగల్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాధ్వని యాత్రలో ఆయన పాల్గొన్నారు.
కుణిగల్ పట్టణంలో డీకే శివకుమార్ వాహనంపై పూలవాన
తుమకూరు, న్యూస్టుడే : కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ పేర్కొన్నారు. కుణిగల్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాధ్వని యాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. ప్రజల కష్టాలు, బాధలు, సమస్యలు ఆలకించడం కోసమే మీ దగ్గరికి వచ్చామని పేర్కొన్నారు. ప్రజల కష్టాలకు స్పందించడంతో పాటు వారికి పరిహార మార్గాలు చూపడానికి నాల్గు గ్యారెంటీ పథకాలు ప్రకటించామన్నారు. గృహజ్యోతి కింద ప్రతి ఇంటికీ 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, గృహలక్ష్మీ ద్వారా ఇంటి మహిళకు నెలకు రూ.2వేలు, పేద కుటుంబ సభ్యుడికి నెలకు 10 కిలోల బియ్యం, డిగ్రీ పూర్తయిన యువతకు యువనిధి పథకం కింద రెండేళ్ల పాటు నెలకు రూ.3వేలు, డిప్లొమా నిరుద్యోగులకు రూ.1500 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం శ్రమించిందని, భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కుమారసామికి మద్దతిచ్చి అధికారం ఇచ్చాం దాన్ని నిలబెట్టుకోలేదని జేడీఎస్పై మండిపడ్డారు. యాత్రలో బెంగళూరు రూరల్ లోకసభ సభ్యుడు డి.కె.శివకుమార్, రాజ్యసభ సభ్యుడు చంద్రశేఖర్, కుణిగల్ ఎమ్మెల్యే డా.రంగనాథ్, మాజీ మంత్రి ఉమాశ్రీ, మహిళా ప్రతినిధి అనసూయమ్మ వై.కె.రామయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’