logo

రైల్వే టీసీపై చర్యలు

కోల్‌కతాకు చెందిన ఒక ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించిన రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌ వి.సంతోశ్‌ కుమార్‌ (42)ను గత వారం అరెస్టు చేశామని రైల్వే పోలీసులు మంగళవారం వెల్లడించారు.

Published : 22 Mar 2023 02:49 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కోల్‌కతాకు చెందిన ఒక ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించిన రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌ వి.సంతోశ్‌ కుమార్‌ (42)ను గత వారం అరెస్టు చేశామని రైల్వే పోలీసులు మంగళవారం వెల్లడించారు. సంతోశ్‌ తనతో అనుచితంగా ప్రవర్తించారని మహిళ (27) ఫిర్యాదుతో తంబుచెట్టి పాళ్యకు చెందిన ఆయనను కేఆర్‌పురం రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించి, గొడవకు దిగి దాడి చేసిన ఘటనను మరో ప్రయాణికుడు చరవాణిలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హౌరా నుంచి కేఆర్‌పురం స్టేషన్‌కు మార్చి 13న వచ్చిన ఆమెను సంతోశ్‌ కుమార్‌ టిక్కెట్టు చూపించాలంటూ సూచించాడు. ఆమె టిక్కెట్టు తీసేలోగా మొహంపై కొట్టి, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని