తల్లిని జేబు ఖర్చులడిగే రాహుల్తో నిరుద్యోగ భృతి అసాధ్యం
తల్లిని జేబు ఖర్చులకు అడిగే రాహుల్గాంధీ రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గ్యారెంటీ ఇవ్వడం హాస్యాస్పదమని భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య ఎద్దేవా చేశారు.
గంగావతిలో భాజపా యువమోర్చా సమావేశం ప్రారంభిస్తున్న తేజస్విసూర్య
గంగావతి,న్యూస్టుడే: తల్లిని జేబు ఖర్చులకు అడిగే రాహుల్గాంధీ రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గ్యారెంటీ ఇవ్వడం హాస్యాస్పదమని భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం గంగావతిలో భారతీయ జనతా యువమోర్చా సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ యువతను ఆత్మాభిమానంతో బతకనివ్వదన్నారు. తమ కాళ్లపై నిలబడి జీవించే పథకాలను కాక నిరుద్యోగ ఉృతితో పరాన్నజీవులుగా మార్చుతున్నారన్నారు. రాహుల్ ఎక్కడా పనిచేసి జీతం తీసుకున్న దాఖలా లేదన్నారు. తల్లి ఇచ్చే జేబు ఖర్చులతో నెట్టుకొస్తున్నారన్నారు. నేటి యువత కష్టపడి పనిచేసి కుటుంబాలను పోషించే మనోభావాలు కలిగి ఉన్నారన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను కన్నడిగులు నమ్మరాదన్నారు. ఇప్పటికే వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, కేంద్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలుంటే ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. 2024లో మళ్లీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రానుంది..రాష్ట్రంలో యువమోర్చా కార్యకర్తలు అంకితభావంతో కృషిచేసి శాసనసభ ఎన్నికల్లో భాజపా అధికారం చేపట్టేలా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణస్వామి, శాసనసభ్యడు పరణ్ణ మునవళ్ళి, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సందీప్కుమార్, ధడేసూగూరు బసవరాజ్, నెక్కంటి సూరిబాబు, గిరేగౌడ, తిప్పేరుద్రస్వామి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా