అంతు చిక్కని లెక్కలు
రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్ నేడో.. రేపో అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నా.. జాతీయ పార్టీలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
అభ్యర్థుల ఎంపికలో ఇక్కట్లు
ఆలస్యమవుతున్న జాబితాలు
ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్ నేడో.. రేపో అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నా.. జాతీయ పార్టీలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఉగాది పండుగ రోజు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలిజాబితాను వెల్లడిస్తామని ప్రకటించింది. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ ను వాయిదా వేసింది. ఇక అధికార పక్షం భాజపాలో అభ్యర్థుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అసలు తొలి జాబితాలో ఎందరికి టికెట్ ప్రకటిస్తారో.. ఏరోజు ప్రకటిస్తారో ఇంత వరకు తెలియరాలేదు. దిల్లీ నుంచి కీలక నేతలంతా వచ్చి పోతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. జాబితా ఆ కబురు మాత్రం వెల్లడించలేకపోతున్నారు.
* కాంగ్రెస్ పార్టీ గతవారం దిల్లీలో టికెట్ల విషయంపై ఎన్నికల సమితిలో సుదీర్ఘంగా చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీలతో రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమావేశమయ్యారు. అభ్యర్థుల తొలి జాబితా దాదాపు ముగిసినట్లే భావించారు. హస్తిన నుంచే హస్తవాసుల భవిష్యత్తు బయటపడుతుందని ఊహించినా అలాంటిదేమీ జరగలేదు. ఈనెల 22న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించినా అదీ సంభవించలేదు. మరో రెండు రోజుల్లో ఆ కబురు అందిస్తామని డీకే శివకుమార్ వెల్లడించి ఉత్కంఠను మరింత కాలం పొడిగించారు. సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితా చివరి క్షణంలో తారుమారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భాజపా ఏ క్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే వీలుంది. ఆలోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించేందుకు వెనకాడుతున్నారు.
వారి కోసమేనా?
కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి, కీలక నేత సిద్ధరామయ్య పోటీ చేసే స్థానం అంతు చిక్కని వ్యవహారంగా మారింది. తనకు తానుగానే కోలార నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఉన్నపళంగా తన మాట మార్చి సొంత పార్టీనే కాదు.. ప్రత్యర్థులను డోలాయమానంలో పడేశారు. సిద్ధరామయ్య స్థానంలో పోటీదారుడిగా అభ్యర్థిని ఎన్నుకోవటంలో భాజపా, జేడీఎస్లు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. 2018లోనే తాను పోటీ చేసిన చాముండేశ్వరిలో బయటి పార్టీలతో పాటు అంతర్గత శక్తులన్నీ పని చేశాయని స్వయంగా సిద్ధరామయ్య ప్రకటించారు. ఈసారి పోటీ చేసే స్థానాన్ని చివరి వరకు వెల్లడించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోలార, వరుణ, బాదామి.. ఇలా ఎక్కడి నుంచైనా సిద్ధరామయ్య పోటీ చేసే వీలుంది. మరో వైపు పార్టీలో కొత్తగా చేరిన పుట్టణ్ణయ్య, మోహన లింగేకాయి, బాబూరావు చించనసూరు, త్వరలో చేరబోయే శివలింగేగౌడ తదితరుల కోసం టికెట్ లెక్కలు తారుమారయ్యే వీలుంది. ఇందు కోసం అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు మరింత సమయం తీసుకుంటున్నారు.
భాజపాలోనూ అంతే..
భాజపాలోనూ పైకి కనిపించకున్నా లోలోపల టికెట్లపై అంతర్గత సమీక్షలు కొనసాగుతున్నాయి. గెలుపు సత్తా, యువకులు, పార్టీ విధేయులు.. ఇలా విభిన్న సమీకరణాలతో జాబితా సిద్ధం చేయటం పార్టీకి తలకు మించిన భారంగా మారింది. ఈ జాబితా బాధ్యత అధిష్ఠానానికి చేరవేసినా స్థానిక నేతల నుంచి వచ్చే ఒత్తిడిని రాష్ట్ర నేతలు తట్టుకోలేని స్థితికి చేరారు. పార్టీలో ప్రస్తుతం 70వ పడిలో ఉన్నవారికి టికెట్ తప్పే ప్రమాదం ఉండటంతో ఆ వయసు వారంతా ప్రత్యామ్నయం కోసం చూస్తున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇప్పటికే తాను శిగ్గావి నుంచి పోటీ చేస్తానని ప్రకటించటమే కాదు.. మళ్లీ సీఎంగా వస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు శికారిపుర క్షేత్రంలో బి.వై.విజయేంద్ర, శివమొగ్గ నుంచి కేఎస్ ఈశ్వరప్ప, హుబ్బళ్లి ధార్వాడ పశ్చిమ క్షేత్రం నుంచి అరవింద బెల్లద్, సోమణ్ణ, 2019లో బయటి నుంచి వచ్చిన 17 మందిలోనే 10 మంది భవిష్యత్తు డోలాయమానంలో ఉండటంతో అభ్యర్థుల జాబితాపై లెక్కలు తేలని పరిస్థితి. ఈనెల 26న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నిర్వహించే కోర్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల వివరాలు ప్రకటించే వీలుందని సమాచారం.
ఆ పార్టీల జోరు..
ఇప్పటికే తొలి జాబితాలో 123 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జేడీఎస్ ఈనెల 26న మైసూరులో రెండో జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. పంచరత్న రథయాత్రను ఒంటి చేత్తో చుట్టేసిన కుమారస్వామి ఈ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని మైసూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోజున కనీసం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని స్వయంగా కుమారస్వామి వెల్లడించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ 80 మందితో తొలి జాబితాను ఇటీవల వెల్లడించింది. ఎన్నికల ముందు సమీక్షల ప్రకారం ఈసారి విధానసభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు అడుగుపెడతారని ఆప్ ధీమాగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా