ఎత్తిపోతల పథకంతో 18 గ్రామాలు సస్యశ్యామలం
తాలూకాలోని పాపినాయకనహళ్లిలో చేపట్టిన ఎత్తిపోతల పథకంతో విజయనగర నియోజకవర్గంలోని 18 గ్రామాలు, సుమారు 44వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమవుతాయని పర్యాటకశాఖ మంత్రి ఆనంద్సింగ్ పేర్కొన్నారు.
జ్యోతి వెలిగించి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఆనంద్సింగ్
హొసపేటె, న్యూస్టుడే : తాలూకాలోని పాపినాయకనహళ్లిలో చేపట్టిన ఎత్తిపోతల పథకంతో విజయనగర నియోజకవర్గంలోని 18 గ్రామాలు, సుమారు 44వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమవుతాయని పర్యాటకశాఖ మంత్రి ఆనంద్సింగ్ పేర్కొన్నారు. కర్ణాటక నీటిపారుదల నిగమ ఆధ్వర్యంలో పాపినాయకనహళ్లి సమీపంలో తుంగభద్ర నది నుంచి చేపట్టిన చెరువులు నింపే ఎత్తిపోతల పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాలూకాలోని సుమారు 18 గ్రామాల బీడు భూముల రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.243కోట్లతో పాపినాయకనహళ్లి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని గుర్తు చేశారు. తుంగభద్ర నదిలో ఏటా జూన్ నుంచి ఆగస్టు వరకు నదిలోని నీటిని పంప్ల ద్వారా సుమారు 22 చెరువులు నింపుతామన్నారు. చెరువులు నింపడంతో ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు మెరుగుపడతాయన్నారు. తుంగభద్ర నదిలో పుష్కలంగా నీరు పారుతున్న సమయంలో రోజుకు కేవలం 1.6 క్యూసెక్కుల నీటిని గొట్టాల ద్వారా తరలించి చెరువులు నింపుతామన్నారు. దీని కోసం ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు పూర్తి సహకారం అందించారన్నారు. మరో సారి భాజపా ప్రభుత్వం ఏర్పడి, తాను మంత్రి అయితే 22 కాలువలు తవ్వి 22 చెరువుల ద్వారా పొలాలకు నీరు మళ్లించే ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు. దీని కోసం మరో రూ.300 కోట్లు అవసరమన్నారు. రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసిన గుత్తేదారులకు కృతజ్ఞతలు తెలిపారు. చెరువులకు నీరుపారించే విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, వెంటనే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రిని రైతులు సత్కరించారు. కార్యక్రమంలో ఉపవిభాగం అధికారి సిద్ధరామేశ్వర, నీటిపారుదల నిగమ పర్యవేక్షక ఇంజినీరు ఎల్.బసవరాజ్, సహాయక కార్యనిర్వాహక ఇంజినీరు శివశంకర్, తహసీల్దార్ విశ్వజిత్ మెహతా, కమలాపుర పురసభ అధ్యక్షుడు సయ్యద్ అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్