తుంగభద్ర జలాశయం ప్రాంతవాసులకు ఉపశమనం
తుంగభద్ర జలాశయం పరిసర ప్రాంతాల వారికి ఎట్టకేలకు మండలి ఆంక్షల నుంచి విముక్తి కలిగిందని తుంగభద్ర సంయుక్త పోరాట క్రియా సమితి ప్రధాన కార్యదర్శి టి.గోపాలకృష్ణ తెలిపారు. గు
కేంద్ర జలవనరుల శాఖ ఆదేశ ప్రతులను చూపిస్తున్న టీబీడ్యాం నగరసభ సభ్యుడు హనుమంతప్ప
హొసపేటె, న్యూస్టుడే : తుంగభద్ర జలాశయం పరిసర ప్రాంతాల వారికి ఎట్టకేలకు మండలి ఆంక్షల నుంచి విముక్తి కలిగిందని తుంగభద్ర సంయుక్త పోరాట క్రియా సమితి ప్రధాన కార్యదర్శి టి.గోపాలకృష్ణ తెలిపారు. గురువారం టీబీ డ్యాం నగరసభ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీబీ డ్యాం, కమలాపుర ప్రాంతాల్లోని సుమారు 1502 ఇళ్లల్లో నివాసం ఉన్నవారు ఇన్నేళ్లు తుంగభద్ర మండలి ఆంక్షలతో నలిగిపోయారన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా, చేసేవారికి అనుమతి ఇవ్వకపోవడంతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఆనంద్సింగ్ చొరవతో ప్రస్తుతం టీబీ డ్యాం, కమలాపుర వాసులు నివసిస్తున్న సుమారు 70.87 ఎకరాల స్థలాన్ని కర్ణాటక రెవెన్యూ శాఖకు అప్పజెప్పాలని మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కూడా తుంగభద్ర మండలికి ఉత్తరం రాసి, 70.87 ఎకరాల స్థలాన్ని కర్ణాటక రెవెన్యూశాఖకు అప్పగించాలని సూచించారు. రెవెన్యూశాఖ నుంచి, ఆ స్థలం స్థానిక నగరసభ పరిధిలోకి వెళితే, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఇన్నేళ్లు రోడ్డు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో టీబీడ్యాం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. 20 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సమావేశంలో టీబీ డ్యాం వార్డుల నగరసభ సభ్యులు హనుమంతప్ప(బుజ్జి), శరవణన్, కమలాపుర సభ్యుడు ముక్తియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి