కార్యాలయంలోనే ఉద్యోగి ఆత్మహత్య
కర్ణాటక ఖాదీ, గ్రామోద్యోగ మండలి కార్యాలయంలో సతీశ్ పాండు నాయక (42) అనే ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కార్వార, న్యూస్టుడే : కర్ణాటక ఖాదీ, గ్రామోద్యోగ మండలి కార్యాలయంలో సతీశ్ పాండు నాయక (42) అనే ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి కార్వారలోని ఈ కార్యాలయంలోనే ఆయన ఉండిపోయారు. ఆపై.. ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని శనివారం ఉదయం గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలను గుర్తించలేదు. కార్వార పోలీసులు తెలిపారు.
కొండపై నుంచి దూకేసిన ప్రేమికులు
రామనగర, న్యూస్టుడే : తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో రామనగర బెట్టపై చేతన్ (19), సాహిత్య (19) అనే యువ ప్రేమికులు బలవన్మరణానికి ప్రయత్నించారు. వీరిద్దరూ బెంగళూరులోని కత్తరిగుప్పకు చెందిన వారు. బెట్టపై నుంచి కిందకు దూకిన సమయంలో మధ్యలో ఉన్న మరో పెద్దరాతిపై పడి వీరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమికంగా వారిద్దరికీ చికిత్స చేసి, రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. చేతన్ స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రామనగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
పావగడ, న్యూస్టుడే: పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక (7)పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సంధ్యారావ్ తీర్పు ప్రకటించారు. 2021 జులై 30న తమ్ముడితో కలిసి ఆ బాలిక చెరువు వద్ద ఆటాడుకునే సమయంలో పావగడకు సమీపంలోని యలగానకుంటకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి ఫలాల ఆశచూపి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణ అధికారి ఎస్.లక్ష్మికాంత్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376 కింద పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ఎస్.ఆశా బాలిక తరఫున వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..