లాడ్జీలో యువకుడి దారుణ హత్య
విజయనగర జిల్లా హగరిబొమ్మన హళ్లి తాలూకా కృష్ణాపుర తండాకు చెందిన సి.ఇంద్రకుమార్(25) విజయపురలోని ఓ లాడ్జీలో దారుణ హత్యకు గురయ్యాడు.
మరొకరు ఆత్మహత్య
హొసపేటె, న్యూస్టుడే : విజయనగర జిల్లా హగరిబొమ్మన హళ్లి తాలూకా కృష్ణాపుర తండాకు చెందిన సి.ఇంద్రకుమార్(25) విజయపురలోని ఓ లాడ్జీలో దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం పక్కనే మరో యువకుడి మృతదేహం ఉంది. ఆ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి వివరాలు తెలియరాలేదు. కృష్ణానగర్ తండాకు చెందిన ఇంద్రకుమార్ ఈనెల 22న ఆధార్ కార్డు చూపి విజయపురలోని ఓ లాడ్జీలో దిగాడు. అతను ఉంటున్న గదికి మరో యువకుడు ఎప్పుడు వచ్చాడో తెలియదని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. శుక్రవారం రాత్రి యువకుడు ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో మాస్టర్ తాళాలతో ద్వారాలు తెరిచారు. గదిలో ఇద్దరి మృతదేహాలు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే గాంధీచౌక్ పోలీసులకు సమాచారం అందింది. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆధారాలు లేని నగదు పట్టివేత
హొసపేటె, న్యూస్టుడే : ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.8లక్షల నగదును హరపన హళ్లి తాలూకా హలువాగలు పోలీసులు శుక్రవారం రాత్రి దుగ్గావతి తనిఖీ ఠాణా వద్ద పట్టుకున్నారు. కొట్టూరు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సంతోష్ రూ.5 లక్షల నగదుతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఠాణా పోలీసులు పట్టుకున్నారు. హరిహర ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి కొట్టూరులోని కంపెనీ శాఖకు తీసుకెళుతున్నానని ఉద్యోగి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో దావణగెరె జిల్లా కక్కరగొళ్ల వాసి తిమ్మేశ్ రూ.3లక్షల నగదుతో హరపన హళ్లి మీదుగా వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈరెండు ఘటనలపై హలువాగలు పోలీస్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి.
పిల్లల చదువు కోసం చేసిన...అప్పు తీర్చలేక తండ్రి బలవన్మరణం
హొసపేటె, న్యూస్టుడే : పిల్లల చదువుల కోసం బయటి వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక కొట్రేశ్(52) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన కూడ్లిగి తాలూకా శివపురలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. శివపుర వాసి కొట్రేశ్కి కొంత పొలం ఉంది. పంట చేతికొచ్చిన వెంటనే అప్పులు తీర్చవచ్చని, పిల్లల చదువుల కోసం బయట కొంత అప్పుచేశారు. పంట దెబ్బతినడంతో ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఆ బెంగతో హగరిబొమ్మన హళ్లి మార్గంలోని ఓ పశువుల పాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కూడ్లిగి పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
యూట్యూబర్ దుస్సాహసం
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!