డబుల్ ఇంజిన్ సర్కార్ను ఆశీర్వదించండి
దళితలు, గిరిజనులు, అల్పసంఖ్యాక, వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కరం, వారి అభివృద్ధికి పాటు పడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ను ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు కోరారు.
మాట్లాడుతున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో లోక్సభ మాజీ
సభ్యులు, భాజపా జిల్లా అధ్యక్షుడు మురహరగౌడ తదితరులు…
బళ్లారి, న్యూస్టుడే : దళితలు, గిరిజనులు, అల్పసంఖ్యాక, వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కరం, వారి అభివృద్ధికి పాటు పడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ను ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు కోరారు. బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం వ్యాప్తిలోని కౌల్బజార్లో ఆదివారం ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విధానసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తాయిలాలు అందజేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గ్యారెంటీ కార్డులతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి భాజపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. లోక్సభ మాజీ సభ్యులు జె.శాంత, సణ్ణ పక్కీరప్ప, గురులింగనగౌడ, జిల్లా భాజపా అధ్యక్షుడు గోనాళు మురమురిగౌడ, సభ్యులు ఓబలేశ్, కార్పొరేటర్ గోవిందరాజులు, నూర్బాషా, అనిల్కుమార్ నాయుడు, వి.కె.బసప్ప పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా