logo

విద్యార్థులు, తల్లిదండ్రులపై తెనెటీగల దాడి

ఆదర్శ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన కుష్టగిలో ఆదివారం జరిగింది.

Published : 27 Mar 2023 02:24 IST

ఆసుపత్రిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

గంగావతి, న్యూస్‌టుడే : ఆదర్శ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన కుష్టగిలో ఆదివారం జరిగింది. హిరేమన్నాపుర, తుళువగెరా, నిడశేషి తదితర గ్రామాల విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు క్రైస్తకింగ్‌ పాఠశాల కేంద్రానికి వచ్చారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లపై గూడు కట్టిన తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈఘటనలో సుమారు 50 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అయిదుగురిని కుష్టగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డీడీపీఐ ఎం.ఎరెడ్డేర్‌ తెలిపారు. గాయపడిన అందరికీ చికిత్స అందించామన్నారు. ఇదిలా ఉండగా కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరీక్ష రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని