logo

ఇద్దరు రైతుల దుర్మరణం

ఎండు మిరపకాయల బస్తాలను వాహనంలో తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతిచెందారు.

Published : 27 Mar 2023 02:24 IST

మరో ఇద్దరికి గాయాలు

ఘటనా స్థలంలో మృతదేహాలు

బళ్లారి, న్యూస్‌టుడే : ఎండు మిరపకాయల బస్తాలను వాహనంలో తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈఘటన చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా తమ్మేనహళ్లి గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా బొమ్మనహాళ్‌ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన వారని గుర్తించారు. దాసరి కేశప్ప(30), బోయ వండ్రప్ప(64), కుమ్మరి సోమణ్ణ తమ పొలాల్లో పండించిన ఎండు మిరప కాయల బస్తాలను వాహనంలో హవేరి జిల్లా బ్యాడగి మార్కెట్‌కు తీసుకొని బయలు దేరారు. ఈక్రమంలో కర్ణాటకలోని తమ్మేనహళ్లి వద్ద ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈఘటనలో కేశప్ప, వండ్రప్పలు తీవ్రంగా పడ్డారు. స్థానికులు గుర్తించి రాంపుర పోలీసులు సహకారంతో బళ్లారి విమ్స్‌కు తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఇదే ఘటనలో సోమణ్ణ, డ్రైవర్‌ హొన్నూర్‌సాబ్‌ గాయపడ్డారు. రాంపుర పోలీసులు విమ్స్‌కు చేరుకుని మృతదేహాలను పరిశీలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని