ఇద్దరు రైతుల దుర్మరణం
ఎండు మిరపకాయల బస్తాలను వాహనంలో తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతిచెందారు.
మరో ఇద్దరికి గాయాలు
ఘటనా స్థలంలో మృతదేహాలు
బళ్లారి, న్యూస్టుడే : ఎండు మిరపకాయల బస్తాలను వాహనంలో తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈఘటన చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా తమ్మేనహళ్లి గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన వారని గుర్తించారు. దాసరి కేశప్ప(30), బోయ వండ్రప్ప(64), కుమ్మరి సోమణ్ణ తమ పొలాల్లో పండించిన ఎండు మిరప కాయల బస్తాలను వాహనంలో హవేరి జిల్లా బ్యాడగి మార్కెట్కు తీసుకొని బయలు దేరారు. ఈక్రమంలో కర్ణాటకలోని తమ్మేనహళ్లి వద్ద ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈఘటనలో కేశప్ప, వండ్రప్పలు తీవ్రంగా పడ్డారు. స్థానికులు గుర్తించి రాంపుర పోలీసులు సహకారంతో బళ్లారి విమ్స్కు తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఇదే ఘటనలో సోమణ్ణ, డ్రైవర్ హొన్నూర్సాబ్ గాయపడ్డారు. రాంపుర పోలీసులు విమ్స్కు చేరుకుని మృతదేహాలను పరిశీలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?