కన్నడనాట కాషాయపతాక రెపరెపలాడిస్తాం
కర్ణాటక సమగ్రాభివృద్ధికి విధానసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టాలని కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘2018 ఎన్నికల్లో భాజపాకు 104 సీట్లు ఇచ్చి అస్పష్టతమైన తీర్పు ఇచ్చారు.
గత ఎన్నికల తీర్పును పునరావృతం కానీయొద్దు
కేంద్ర మంత్రి అమిత్ షా
రిమోట్ నొక్కి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న హోం మంత్రి
రాయచూరు, న్యూస్టుడే: కర్ణాటక సమగ్రాభివృద్ధికి విధానసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టాలని కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘2018 ఎన్నికల్లో భాజపాకు 104 సీట్లు ఇచ్చి అస్పష్టతమైన తీర్పు ఇచ్చారు. 30 సీట్లలోపు ఉన్న దళ్తో కలిసి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. సంకీర్ణ పాలన ఎలా కొనసాగిందో ప్రజలకు ఎరుకే. ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్థితిని పునారవృతం చేయవద్దని’ కోరారు. అమిత్ షా ఆదివారం జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో దేవదుర్గ, రాయచూరు నియోజకవర్గాలకు సంబంధించి రూ.4,223.02 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రిమోట్ ద్వారా శంకుస్థానలు చేశారు. అనంతరం హోం శాఖ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అవినీతికి పాల్పడుతోంది. ప్రజలు అప్పగించే అధికారాన్ని ఏటీఎంగా వాడుకుని, ఆ డబ్బును దిల్లీకి పంపుతోందని ఆరోపించారు. ప్రజలు ఆ పార్టీ వాగ్దానాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రజలకు ఏమి చేయదన్నారు. రాహుల్ గాంధీనే ఆ పార్టీని అంతం చేస్తారని జోస్యం చెప్పారు. ఇదే నెలలో వెలువడిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క చోట ఐదు సీట్లను కాంగ్రెస్ గెలవకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో పాక్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి తరచూ వస్తూ అలజడి సృష్టించే వారని, మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాదుల ఆటకట్టించిన విషయం దేశ ప్రజలకు తెలుసన్నారు. 2019లో సర్జికల్ స్ట్రైక్ చేసి పొరుగుదేశం మెడలు వంచడంతో భారత్ వైపు చూడాలంటే దడ పుట్టే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భారత్ సురక్షితంగా, సుభద్రంగా ఉండాలంటే మోదీ పాలన ఈ దేశానికి అవసరమన్నారు.
కరోనా సమయంలో 130 కోట్ల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం మోదీ ప్రభుత్వం ఘనతగా పేర్కొన్నారు. 80 కోట్ల మంది పేదలకు గరీబ్ కల్యాణ పథకంలో బియ్యం పంపిణీ, అత్యధికంగా మరుగుదొడ్ల నిర్మాణం, పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని వివరించారు. ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక దేశంగా ఎదగటానికి, అంకుర పరిశ్రమల స్థాపనలో అగ్రస్థానంలో ఉండేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. దేశం అయిదు బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మోదీ వల్లనే అవుతుందన్నారు.
వీఐపీ గ్యాలరీలో పార్టీ నాయకులు
కర్ణాటకకు ఎంతో చేశాం
అప్పర్ భద్రా ప్రాజెక్టు విస్తరణకు, ఎగువ కృష్ణాలో కాలువల నిర్మాణాలకు కేంద్రం అత్యధికంగా నిధులు ఇచ్చిందని తెలిపారు.మహదాయి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించామని చెప్పారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం, వక్కలిగులు, పంచమశాలిలకు రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని, దళిత వర్గీకరణ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసి సీఎం బొమ్మై చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు కల్యాణ కర్ణాటక మండలికి రూ.5 వేలకోట్లు కేటాయించడంతోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఊపందుకుందన్నారు. గిణిగేరా-మహబూబ్నగర్ రైల్వే మార్గం పనులు, రాయచూరు జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం నిధులను విడుదల చేసిందని వివరించారు. ఈ జిల్లాలో ప్రగతి పనులు మరింత వేగంగా జరగాలంటే ఏడు నియోజవర్గాల్లో భాజపాను గెలిపించాలని అమిత్షా పిలుపునిచ్చారు.
సభకు హాజరైన ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!