ప్రమాదకర స్థితిలో ప్రజాస్వామ్యం
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అపాయకరమైన స్థితికి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్శ ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అపాయకరమైన స్థితికి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్శ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా పార్లమెంట్లో ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేసి గొంతు నొక్కారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రస్తుత అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా పాలక పక్షం సభ్యులు అడ్డుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలు భాజపాను నిద్రలేకుండా చేశారని, పార్లమెంట్లో అంశాలు చర్చకు రాకుండా సమావేశాలు సక్రమంగా జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. లండన్లో చేసిన వ్యాఖ్యానాలకు సమాధానం ఇచ్చేందుకు రాహుల్గాంధీ సిద్ధపడినా.. అందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదన్నారు. గతంలో అనేక సమస్యలు, కుంభకోణాలపై పార్లమెంట్ సంయుక్త సమితులను జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ నరసింహరావు, మన్మోహన్సింగ్, తదితరులు వేశారని గుర్తు చేశారు. అదాని సంస్థలను గురించి అధ్యయనం చేసేందుకు ఎందుకు సమితి ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటారని ప్రశ్నించారు. రాహుల్గాంధీ ఏ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, క్రిమినల్ చర్యలకు పాల్పడలేదని, ఏవర్గాన్ని రెచ్చకొట్టలేదని, దేశాన్ని దోచుకుని విదేశాలకు పరారైన వ్యక్తుల గురించి మాట్లాడితే ఆయనకు న్యాయస్థానం శిక్ష విధించిందన్నారు. దీని వెనక పెద్దకుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్