బళ్లారి నగర పాలికె పీఠంపై త్రివేణి
బళ్లారి నగర పాలికె 21వ మేయర్గా డి.త్రివేణి, ఉప మేయర్గా బి.జానకీ ఎన్నికయ్యారని కలబురిగి ప్రాదేశిక కమిషనర్ కృష్ణబాజపేయి బుధవారం ప్రకటించారు.
24వ మేయర్గా ఎన్నిక
ఉపమేయర్గా బి.జానకీ ఏకగ్రీవం
ఎన్నికల్లో పాల్గొన్న శాసనసభ్యులు
బళ్లారి, న్యూస్టుడే : బళ్లారి నగర పాలికె 21వ మేయర్గా డి.త్రివేణి, ఉప మేయర్గా బి.జానకీ ఎన్నికయ్యారని కలబురిగి ప్రాదేశిక కమిషనర్ కృష్ణబాజపేయి బుధవారం ప్రకటించారు. బళ్లారి నగర పాలికె మొదటి విడత (20వ అవధి) 2022 మార్చి 18న జరిగిన మేయర్ ఎన్నికల్లో మేయర్ మోదపల్లి రాజేశ్వరి, ఉపమేయర్గా మాలన్బీ ఎన్నికైన విషయం తెలిసిందే. వారి పదవీ కాలం ఈ నెల 18న ముగిసింది. 21న మేయర్, ఉపమేయర్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఇదివరకే ప్రాదేశిక కమిషనర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్కు ఎన్నికల ప్రకటన అందక పోవడంతో ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. మేయర్గా ఎస్సీ జనరల్, ఉపమేయర్గా ఎస్టీ మహిళ రిజర్వేషన్ కాగా, మేయర్కు 4వ వార్డు కార్పొరేటర్ డి.త్రివేణి, 7వ వార్డు కార్పొరేటర్ ఉమాదేవి శివరాజు, 38వ వార్డు కార్పొరేటర్ వి.కుబేరా కాంగ్రెస్ పార్టీ నుంచి నామపత్రాలు సమర్పించారు. భాజపా నుంచి నాగరత్నప్రసాద్ నామపత్రాలు ఉదయం 10.30లకు నగర పాలికె కమిషనర్ రుద్రేశ్కు సమర్పించారు. ఉపమేయర్ 33వ వార్డు కార్పొరేటర్ బి.జానకీలు నామపత్రం సమర్పించారు. మధ్యాహ్నం 12గంటలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నామపత్రాలు సమర్పించిన ఉమాదేవి శివరాజు, వి.కుబేరా వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డి.త్రివేణి, భాజపా నుంచి 16వ వార్డు నాగరత్నలు పోటీలో నిలిచారు. 39 మంది కార్పొరేటర్లు, రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్ నాసీర్ హుసేన్, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, శాసనసభ్యులు గాలి సోమశేఖర్రెడ్డి, బి.నాగేంద్ర ఎన్నికల్లో పాల్గొన్నారు.
డి.త్రివేణి, బి.జానకీ
28 కార్పొరేటర్ల మద్దతు
కార్పొరేటర్లలో 44 మందికి గాను....కాంగ్రెస్ అభ్యర్థి డి.త్రివేణికి 28, భాజపా అభ్యర్థి నాగరత్నకి 16 ఓట్లు పడ్డాయి. పరిశీలించిన కలబురిగి ప్రాదేశిక కమిషనర్ కృష్ణ బాజపేయి మేయర్గా డి.త్రివేణి ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉపమేయర్గా కాంగ్రెస్ పార్టీ బి.జానకీ మాత్రమే నామపత్రం సమర్పించగా, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఎన్నికపై సుదీర్ఘ చర్చలు
బళ్లారి నగర మేయర్, ఉపమేయర్గా రెండు రోజులుగా సుదీర్ఘంగా చర్చించారు. మేయర్, ఉపమేయర్ ఎన్నిక కమిటీ సభ్యులు మాజీ లోక్సభ సభ్యుడు చంద్రయ్య, రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్ నాసీర్ హుసేన్, గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, ఏఐసీసీ సభ్యుడు అల్లం వీరభద్రప్ప, మేయర్ మోదపల్లి రాజేశ్వరి మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు కార్పొరేటర్లతో చర్చించారు. 16 మంది కార్పొరేటర్లు 4వ వార్డు కార్పొరేటర్ డి.త్రివేణికి మద్దతు ప్రకటించారు. మిగిలిన కార్పొరేటర్లు వి.కుబేరా, శిల్పలకు మద్దతు ప్రకటించారు. దీనిపై కమిటీ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం ఉదయం 9గంటలకు మరోసారి నక్షత్ర హోటల్లో సమావేశం నిర్వహించి కార్పొరేటర్లు అభిప్రాయాలు తీసుకున్నారు. చివరికి మేయర్ అభ్యర్థిగా డి.త్రివేణి, ఉపమేయర్ అభ్యర్థిగా బి.జానకీలు పేర్లు ప్రకటించారు. మేయర్ పోటీలో ఉన్న వి.కుబేరా, ఉమాదేవి శివరాజు కూడా నామపత్రాలు సమర్పించారు. చివరికి వారు నామపత్రాలు వెనక్కి తీసుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
* ఒకే ఇంటి నుంచి ఇద్దరు మేయర్లు : బళ్లారి నగర పాలికెలో ఒకే ఇంటి నుంచి గతంలో తల్లి సుశీలబాయి, ప్రస్తుతం కుమార్తె త్రివేణి మేయర్ కావడంతో పాటు అతిచిన్న వయస్సు 23 ఏళ్లకే డి.త్రివేణి మేయర్గా ఎంపికై నగర పాలికెలో రికార్డు సృష్టించారు.
నగరాభివృద్ధికి పాటుపడతా : త్రివేణి
అతి చిన్న వయస్సులో మేయర్గా ఎంపిక కావడంతో సంతోషంగా ఉంది. 2018-19లో మా అమ్మ సుశీలబాయి మేయర్గా పని చేశారు. 2022-23 ఏడాదికి నేను మేయర్గా ఎంపికయ్యాను. నేను కలలో కూడా అనుకోలేదు. మా తండ్రి సూరికి నన్ను మేయర్ చేయాలని కల ఉండేది. ఇప్పుడు ఆ కల నేరవేరింది. కార్పొరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
మేయర్, ఉపమేయర్ ఎన్నికకు హాజరైన లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్ నాసీర్ హుసేన్, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్రెడ్డి, బి.నాగేంద్ర, కాంగ్రెస్, భాజపా కార్పొరేటర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
భార్య హంతకుడికి ఐదేళ్ల కారాగారం
[ 18-04-2024]
సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్ హబీబ్ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం.. -
భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ
[ 18-04-2024]
కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. -
భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం
[ 18-04-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?
[ 18-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్ జోసి- యువనేత వినోద్ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. -
పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్
[ 18-04-2024]
గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్ మిల్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
[ 18-04-2024]
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
కరడికి చేయందించిన కాంగ్రెస్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్లో చేరారు. -
మోదీ సభకు సకల సన్నాహాలు
[ 18-04-2024]
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. -
భాజపాను బలపరుద్దాం
[ 18-04-2024]
మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మంత్రి మల్లికార్జున ప్రచారం
[ 18-04-2024]
బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?