శ్యామనూరు పాత్ర ఏంటి?
విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు వంట పాత్రలను పంచుతున్న ఆరోపణలపై దావణగెరెలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్ఎస్ మల్లికార్జున్పై కేటీజే నగర ఠాణాలో కేసు నమోదైంది.
శివశంకరప్ప
దావణగెరె, న్యూస్టుడే : విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు వంట పాత్రలను పంచుతున్న ఆరోపణలపై దావణగెరెలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్ఎస్ మల్లికార్జున్పై కేటీజే నగర ఠాణాలో కేసు నమోదైంది. ఆయన తండ్రి, మాజీ మంత్రి శామనూరు శివశంకరప్ప ఈ కేసులో మొదటి నిందితుడని ఎస్పీ సీబీ రిష్యంత్ వెల్లడించారు. శివశంకరప్ప, మల్లికార్జున్ చిత్రాలు ఉన్న బాక్సులను భగత్సింగ్ నగరలో పంచేందుకు తీసుకు వచ్చి- ఒక చోట నిలువ ఉంచారని వచ్చిన ఫిర్యాదులతో బుధవారం రాత్రి దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. రూ.7.19 లక్షల విలువైన కుక్కర్లు, చీరలు, వంట సామగ్రిని స్వాధీనపరుచుకున్నామని పోలీసులు తెలిపారు. భాజపా కార్యకర్త కాడజ్జి హనుమంతప్ప ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాము ఎవరికీ ఉపకరణాలు, చీరలను పంచలేదని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లికార్జున్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాక మునుపు, ఉగాది సమయంలో తమ అభిమానులు వాటిని పంచి ఉంటారని పేర్కొన్నారు. లేదా భాజపా నాయకులే కుట్ర పూరితంగా తమ చిత్రాలు ముద్రించి వీటిని పంపిణీ చేసి ఉండవచ్చని ఆరోపించారు. తనపై లోక్సభ సభ్యుడు జీఎం సిద్ధేశ్వర్ పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాలు విసరారు. నేనైతే ఎన్నికల ప్రచార సభలకు సన్నాహాలు చేసుకుంటున్నానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్