లోక్సభ దిశగా అడుగులు
లోక్సభ ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని- దిల్లీ దిశగా అడుగులు మన నేతలు అడుగులు వేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పిలుపునిచ్చారు.
శ్రేణులకు కుమార పిలుపు
దేవేగౌడను వేదికపైకి తీసుకు వస్తున్న భద్రతా సిబ్బంది
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : లోక్సభ ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని- దిల్లీ దిశగా అడుగులు మన నేతలు అడుగులు వేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తేనే కర్ణాటకలో ప్రస్తుత ప్రభుత్వానికి మనుగడ ఉంటుందన్నారు. దళపతి దేవేగౌడతో కలిసి ఆత్మావలోకన సభను గురువారం బెంగళూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార మాట్లాడారు. పార్టీ అధ్యక్ష స్థానానికి సీఎం ఇబ్రహీం, యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి తమ పదవులకు రాజీనామా చేశారని, కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకుంటామని తెలిపారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అధైర్యపడవద్దని సూచించారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. గెలిస్తే కారణాలు విశ్లేషించరని, ఓడితేనే కారణాలను వెతుక్కుంటామని చెప్పారు. ఓటమికి దారితీసిన కారణాలను ఇప్పటికే విశ్లేషించుకున్నామని తెలిపారు. చివరి క్షణంలో అభ్యర్థులను ఎంపిక చేయడం, వారికి ఆర్థిక సహకారం అందించలేకపోవడంతో ఎక్కువ మంది ఓడిపోయారని అంచనాకు వచ్చామని చెప్పారు. కాంగ్రెస్, భాజపా నాయకులు వ్యూహాత్మకంగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. భాజపా తాను చేసిన తప్పులకు, కులం, మతం ఆధారంగా ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించి ఎదురుదెబ్బ తిన్నట్లు వివరించారు. కుమటలో కేవలం 600 ఓట్ల తేడాతో సూరజ్ నాయక్ సోని ఓడిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. దేవేగౌడ 1989లో రెండు చోట్లా ఓడిపోయారని, ఆ తర్వాత 1994లో పూర్తి మెజార్టీతో పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ప్రధాని దేవేగౌడ, ఎమ్మెల్సీ శరవణ, మాజీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం తదితరులు ఆత్మావలోకన సభలో పాల్గొన్నారు.
కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న దళపతి దేవేగౌడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్