అక్షర వనం.. శుభారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గ్రాంట్లు అందుకుంటున్న, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు నోటు, అచ్చుపుస్తకాలు, సమవస్త్రాలు, బూట్లు వితరణ చేశారు.
పాఠశాలకు వస్తూ ప్రవేశద్వారం వద్ద విద్యార్థుల సందడి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గ్రాంట్లు అందుకుంటున్న, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు నోటు, అచ్చుపుస్తకాలు, సమవస్త్రాలు, బూట్లు వితరణ చేశారు. మొదటి రెండు రోజుల్లో వాటిని అందుకోని విద్యార్థులకు బుధవారం సమకూర్చారు. రెండు నెలల అనంతరం బడికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ పాత స్నేహితులను కలుసుకుని ముచ్చట్లు పెట్టుకున్నారు. విద్యార్థులను స్వాగతించేందుకు ఉపాధ్యాయులే స్వాగత తోరణాలు కట్టారు. కొన్ని చోట్ల రంగుల ముగ్గులు వేయగా, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పూలు, మిఠాయిలు, చాక్లెట్లను అందించారు. ఉదయం నుంచి ఆటలు ఆడించారు. ఇస్కాన్ సంస్థ నిర్వహణలోని అక్షయ పాత్ర ప్రతినిధులు మధ్యాహ్నానికి వేడి భోజనాన్ని తీసుకు వచ్చారు. బెంగళూరు, చుట్టుపక్కల ఉన్న 1272 పాఠశాలల్లో 70 వేల మంది విద్యార్థులకు రాజాజీనగర, వసంతపుర, గుణి అగ్రహార, జిగణిలలోని నాలుగుచోట్ల ఉన్న అధునాతన వంటగదులలో అక్షయ పాత్ర సిబ్బంది ఆహారాన్ని సిద్ధం చేశారు. క్యారెట్, బీన్స్, క్యాబేజీ, నవ్కోల్, బీట్రూట్, పుదీనా తదితరాలను ఉపయోగించి తయారు చేసిన వెజిటబుల్ పలావ్, రవ్వ పాయసం, పెరుగు, అన్నం తదితరాలను మొదటి రోజు విద్యార్థులకు పంపిణీ చేశారు. కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 62,229 ఉండగా, వాటిలో 25,278 ప్రాథమిక, 36,951 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటికి అదనంగా 15,867 మిడిల్ స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థుల్లో అభ్యాస అంతరాలను తగ్గించేందుకు ‘సేతుబంధ’ పేరిట కొత్త బోధన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. ఒకటి నుంచి మూడో తరగతి విద్యార్థులకు 30 రోజులు, నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులకు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎల్కేజీ, ఒకటో తరగతి విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియ కొనసాగించారు.
బాలల కోసం ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్న సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’